పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు | Special Trains for dasara | Sakshi
Sakshi News home page

పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు

Oct 10 2015 7:35 PM | Updated on Sep 3 2017 10:44 AM

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాచిగూడ-సాయినగర్ మధ్య, కాచిగూడ-గుంటూరు మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాచిగూడ-సాయినగర్ మధ్య, కాచిగూడ-గుంటూరు మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ-సాయినగర్ (07267/07268) ప్రత్యేక రైలు ఈ నెల 13, 27వ తేదీల్లో రాత్రి 10.45 కు కాచిగూడ నుంచి, రాత్రి 11.10 కి మల్కాజిగిరి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12.15 కు సాయినగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 14, 28 తేదీలలో సాయంత్రం 7.10 కి సాయినగర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.05 గంటలకు మల్కాజిగిరి, ఉదయం 9.35 గంటలకు కాచిగూడ స్టేషన్ చేరుకుంటుంది.

కాజీపేట్ మీదుగా కాచిగూడ-గుంటూరు మధ్య 10 డబుల్ డెక్కర్ రైళ్లు నడుపనున్నట్లు సీపీఆర్వో తెలిపారు. నడికుడి మీదుగా కాచిగూడ-గుంటూరు, కాచిగూడ-తిరుపతి మధ్య నడిచే డబుల్ డెక్కర్ రైళ్లను ఆ మార్గంలో రద్దు చేసి, తాత్కాలికంగా కాజీపేట్ మీదుగా నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కాచిగూడ-గుంటూరు (02118) డబుల్ డెక్కర్ ఈ నెల 16, 18, 20, 22, 24 తేదీలలో రాత్రి 11 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో గుంటూరు-కాచిగూడ (02117) ఈ నెల 17, 19, 21, 23, 25 తేదీలలో రాత్రి 11 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.25 కు కాచిగూడ చేరుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement