వ్యాట్ డీలర్ల నమోదు షురూ...
జీఎస్టీపై డీలర్లకు అవగాహన సదస్సులు
జూలై 1 నుంచి అమలుకు సన్నాహాలు
సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలుకు రంగం సిద్ధమవుతుండటంతో జీఎస్టీపై వాణిజ్య పన్నుల శాఖ దృష్టి సారించింది. జీఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యాపారులను గుర్తించేందుకు సర్వేకు శ్రీకారం చుట్టింది. మరోవైపు జీఎస్టీఎన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ద్వారా వ్యాట్ పరిధిలోని డీలర్లను జీఎస్టీ కింద మార్పు చేస్తోంది. జీఎస్టీ పన్ను విధానంపై సర్కిల్ వారిగా సదస్సులు నిర్వహిస్తూ వ్యాపారులకు అవగాహ కల్పిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జీఎస్టీ, ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ, యుటీజీఎస్టీ నాలుగు పన్నులు అమోదించింది. పన్ను రేట్ల కూడా 6, 12, 18, 28గా విభజించింది. ఆయితే ఏ ఏ వస్తువులపై ఎంత పన్ను విధించాలన్న నిర్ణయం తీసుకోలేదు. జూలై1 నుంచి జీఎస్టీ చట్టం అమలులోకి వచ్చే అవకాశం ఉంది. జీఎస్టీ కింద రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల లోపు వార్షిక టర్నోవర్ గల వ్యాపారులు కాంపొజిషన్లో ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ పరిధిలోకి వచ్చే వ్యాపారులు ప్రభుత్వానికి ఒక శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆయితే రాష్ట్ర పరిధి దాటితే మాత్రం పన్ను రేటులో మార్పు ఉంటుంది. వ్యాపారులందరూ జీఎస్టీ కింద నమోదు చేసేవిధంగా విస్తృత అవగాహన కార్యక్రమాలకు అధికారులు శ్రీకారం చుట్టారు.
నగరంలో 1.30 లక్షలపైనే డీలర్లు..
గ్రేటర్ హైదరాబాద్లోని వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో ఏడు డివిజన్లలు ఉండగా, వాటి పరిధిలో గల 55 సర్కిల్స్ ఉన్నాయి. ప్రస్తుతం వ్యాపార సంస్థల టర్నోవర్ ఏడాదికి రూ.7.50 లక్షల నుంచి రూ.50 లక్షల టర్నోవర్ సంస్థలు టర్నోవర్ టాక్స్ (టీవోటీ), వ్యాపార టర్నోవర్ రూ.50 లక్షలు దాటిన సంస్థలు వ్యాట్ (విలువ ఆథారిత పన్ను) పరిధిగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం వ్యాట్ డీలర్లుగా 1.11 లక్షలు, టీవోటీ డీలర్లుగా 21 వేల సంస్థలు మాత్రమే నమోదు చేసుకొని ఉన్నాయి. మహానగరంలోని మొత్తం వాణిజ్య, వ్యాపార సంస్థల్లో వ్యాట్, టర్నోవర్ టాక్స్ కింద నమోదైన సంస్థలు 60 శాతానికి మించి లేనట్లు తెలుస్తోంది. మిగిలిన 40 శాతం సంస్థలు నమోదుకు దూరం పాటిస్తున్నారు. వాటిని సైతం జీఎస్టీ పరిధిలోకి తేచ్చేందుకు వాణిజ్య పన్నుల శాఖ కసరత్తు చేస్తోంది
జీఎస్టీపై ప్రత్యేక దృష్టి!
Published Mon, May 15 2017 12:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement