రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించే కేసులన్నీ నేర దర్యాప్తు సంస్థ (సీఐడీ)కు వెళ్తాయి.
మరో వైపు గ్యాంగ్స్టర్ నయీం కేసులో అదనపు ఎస్పీ సస్పెండ్ అయ్యారు. ఇక మియాపూర్ స్కాం కేసుతోపాటు ఎంసెట్ స్కాం, బోధన్ స్కాం.. కేసులు కూడా ఇప్పుడు రిలీవ్ కాబో తున్న అధికారులే పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ అధికారులు రిలీవ్ అయితే ఈ కేసుల్లో దర్యాప్తు పరిస్థితి, వాటి పురోగతి ఏంటన్న దానిపై ఉన్నతాధికారుల్లో ఆందో ళన నెలకొంది. ఉన్న డీఎస్పీలతో దర్యాప్తు చేయించాలని చూస్తున్నా.. వాళ్లకు పాత కేసులే పీకల వరకు ఉన్నాయి. పైగా వారిని మానిటర్ చేసేందుకు నేరుగా సీఐడీ అదనపు డీజీపీయే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు కేసుల దర్యాప్తు, మరో వైపు అడ్మిన్ వ్యవహారాలు, ఆర్థిక నేరాలు, సైబర్ క్రైమ్, క్రైమ్ రికార్డ్స్బ్యూరో.. ఇలా అన్ని విభాగాలను సీఐడీ అదనపు డీజీపీయే చూసుకోవాల్సిన పరిస్థితి. పదోన్నతులు ప్రక్రియ పూర్తయితే కొంత మంది అధికారులను సీఐడీకి తీసుకుందామన్నా ఆ ప్రక్రియ ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి వెళ్తోంది. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో పోలీస్ అధికారులున్నారు.