హైదరాబాద్లో రాజస్తానీ ముఠా హల్ చల్ | rajasthan gang in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో రాజస్తానీ ముఠా హల్ చల్

Jan 21 2015 10:32 AM | Updated on Sep 4 2018 5:07 PM

రాజస్థాన్ నుంచి ఓ ముఠా వచ్చి హైదరాబాద్లో పాగా వేశారు.

హైదరాబాద్ :  రాజస్తాన్ నుంచి వచ్చిన ఓ ముఠా హైదరాబాద్లో ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి డబ్బుల కోసం డిమాండ్ చేసిన సంఘటన కలకలం సృష్టించింది. వ్యాపార నిమిత్తం అహ్మదాబాద్కు చెందిన పురోహిత్ను ఆ ముఠా సభ్యులు  హైదరాబాద్కు పిలిచారు. ఇక్కడికి వచ్చిన తరువాత  వ్యాపారిని బంధించి అతని కుటుంబ సభ్యుల నుంచి రూ.3 కోట్ల డిమాండ్ చేశారు.

అయితే అంత ఇవ్వలేనంటూ రూ. 25 లక్షలు చెల్లించారు. దాంతో డబ్బు తీసుకున్న కిడ్నాపర్లు వ్యాపారిని వదిలేశారు. కాగా అనంతరం పురోహిత్ కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించటంతో ....బోయిన్పల్లిలో ముఠా సభ్యులు ఉంటున్న నివాసంపై దాడి చేశారు. అయితే ఈ విషయాన్ని ముందుగానే పసికట్టిన ఆ ముఠా అక్కడ నుంచి పరారైంది. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement