► రాష్ట్రవ్యాప్తంగా 44,468 కుటుంబాలకు లబ్ధి
► ఈఎస్ఐసీ ప్రాంతీయ సంచాలకులు అరుణ్పాండే
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ పథకంలో కేంద్రం చేపట్టిన సంస్కరణలతో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగిందని కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్ఐసీ) ప్రాంతీయ సంచాలకుడు అరుణ్పాండే పేర్కొన్నారు. ఈఎస్ఐసీ ద్వారా కార్మికులకు అందిస్తున్న సేవలు, సంక్షేమ పథకాల పురోగతిని శనివారం ఆయన మీడియాకు వివరించారు. ఈ ఏడాది భవన నిర్మాణ రంగ కార్మికులకూ ఈఎస్ఐలో చోటు కల్పించామని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 44,468 కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు.
అదేవిధంగా వేతన గరిష్ట పరిమితిని రూ.15వేల నుంచి రూ.21వేలకు పెంచడంతో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. అదేవిధంగా యాజమాన్యాల వాటాను 4.75 శాతంనుంచి 3 శాతానికి తగ్గించి కంపెనీలకు వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు. అంతేకాకుండా ఉద్యోగుల వాటాను 1.75 శాతం నుంచి ఒక శాతానికి తగ్గించి ఉద్యోగిపై కూడా భారం తగ్గించామన్నారు. ఈ ఏడాది జనవరి 20 నుంచి మహిళా ఉద్యోగులకు ఇచ్చే ప్రసూతి సెలవులను 12వారాల నుంచి 26 వారాలకు పెంచడం జరిగిందన్నారు.
రాష్ట్రంలో పలు ఈఎస్ఐసీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామని, మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో ఈఎస్ఐసీ మోడల్ డిస్పెన్సరీ కమ్ డయాగ్నొస్టిక్ సెంటర్ను తెరిచామన్నారు. అదేవిధంగా గోషామహల్లో వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశామని, తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా మొబైల్ డిస్పెన్సరీలు ఏర్పాటు చేసి కార్మికులకు మెరుగైన సేవలను ముంగిట్లో అందిస్తున్నామన్నారు. అత్యవసర సేవలకు సూచనలిచ్చేందుకు ప్రత్యేకంగా 1800 11 3839 టోల్ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశామన్నారు.
నిర్మాణ రంగ కార్మికులకూ ఈఎస్ఐసీలో చోటు
Published Sun, May 28 2017 1:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement