సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల పరిధిలో వెయ్యి చదరపు మీటర్ల విస్తీర్ణంలో జీ+2 అంతస్తుల భవన నిర్మాణాలకు పంచాయతీలు అనుమతులివ్వొచ్చని, ఈ మేరకు హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) అధికారాన్ని బదలాయించిందని తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. ఇంతకు మించిన భారీ ప్రాజెక్టులకు అనుమతినిచ్చే బాధ్యతలను హెచ్ఎండీఏ చేపడుతోందని తెలిపింది.
గ్రామ పంచాయతీల పరిధిలో హెచ్ఎండీఏ లేఔట్లు అభివృద్ధి చేస్తూ భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తోందని, తద్వారా వచ్చే నిధుల్లో వాటా ఇవ్వడం లేదని, దీంతో గ్రామ పంచాయతీల అభివృద్ధి కుంటుపడుతోందని రంగారెడ్డి జిల్లా కొంపల్లి సర్పంచ్ జమ్మి నాగమణి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ డెరైక్టర్ (ప్రణాళిక) ఎస్.బాలకృష్ణ ఓ అఫిడవిట్ను సోమవారం ధర్మాసనం ముందు ంచారు.
పంచాయతీలు వాటి పరిధిలో లేఔట్ల అభివృద్ధి చార్జీలను వసూలు చేసి హెచ్ఎండీఏ ఖాతాకు బదలాయించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని, కొంపల్లి పంచాయతీ మాత్రం అలా బదలాయించడం లేదని చెప్పారు. పంచాయతీల పరిధిలోని లేఔట్లకు సంబంధించి హెచ్ఎండీఏ వసూలు చేసే చార్జీలను ఆ గ్రామ పంచాయతీలతో పంచుకోవాలని నిబంధనల్లో ఎక్కడా లేదని వివరించారు. వీటిని పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోర్టుకు విన్నవించారు. అనంతరం కోర్టు విచారణను వాయిదా వేసింది.
జీ+2 భవనాలకు పంచాయతీలు అనుమతివ్వొచ్చు
Published Wed, Jul 20 2016 1:26 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఓ మదీ మేలుకో..!
‘ఎన్నికల సమయంలో డ్యూటీ పీరియడ్గా పరిగణించాలి’
స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన ఎస్పీ
లూజు పెట్రోల్ విక్రయించరాదు
24న ఎచ్చెర్ల ఐటీఐలో జాబ్ మేళా
మల్లేష్కు కన్నీటి వీడ్కోలు
తగ్గని ఎన్నికల వేడి
మహేంద్రతనయలో పడి యువకుడి మృతి
ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షకు 97 మంది గైర్హాజరు
ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
తప్పక చదవండి
- కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
- Election Commission of India: ఐదో విడతలో 59.06 శాతం
- చత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం
Advertisement