130 కోట్ల నిధుల కేటాయింపు
♦ మలి విడతలో మరో 1,271 పంచాయతీలకు..
♦ శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 8770 గ్రామ పంచాయతీలకుగాను 1,650 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేవని పురపాలక, పంచాయతీరాజ్శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. తొలి విడతగా రూ. 130 కోట్లతో వెయ్యి పంచాయతీలకు నూతన భవనాలను నిర్మిస్తున్నామని, మిగిలిన 650 పంచాయతీలతోపాటు మరో 621 ‘ఒకే గది’ పంచాయతీలకు (మొత్తం 1,271) మలి దశలో భవనాలను నిర్మిస్తామన్నారు. సర్పంచ్, సిబ్బంది, ఈ-పంచాయతీకి ప్రత్యేక గదులు, సమావేశ మందిరంతో కూడిన భవనాలకు ప్రత్యేక డిజైన్ రూపొందించామని చెప్పారు. గతంలో ఒక్కో పంచాయతీ భవన నిర్మాణానికి రూ. 10 లక్షలు కేటాయింపులు జరగ్గా తాము రూ. 13 లక్షలకు పెంచామన్నారు. ఆదివారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు బాజిరెడ్డి గోవర్దన్, బోడిగ శోభ, చల్లా ధర్మారెడ్డి అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ బదులిచ్చారు. ఐదు వేలు జనాభాగల మేజర్ గ్రామ పంచాయతీల భవనాలకు మరిన్ని నిధులిస్తామని...మండల కేంద్రాల్లో సచివాలయాల నిర్మాణం కోసం స్థానిక పంచాయతీలు రూ. 25 లక్షల చొప్పున నిధులు సమకూర్చితే ప్రభుత్వ వాటాను రూ. 25 లక్షలకు పెంచుతామని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎంఎంటీఎస్ రెండో దశకు రూ. 220 కోట్లు
ఎంఎంటీఎస్ రెండో దశను భక్తుల సౌకర్యార్థం ఘట్కేసర్-రాయిగిర్ (యాదాద్రి) వరకు పొడిగించేందుకు రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసిం దని ఈ అంశంపై సభ్యులు వేముల వీరేశం, పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిశోర్, కె.ప్రభాకర్రెడ్డిల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. రూ. 330 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టులో కేంద్రం రూ. 110 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 220 కోట్ల వాటాను భరిస్తుందన్నారు.
ఎస్సీ ఉప ప్రణాళిక కింద 3,773 కోట్ల ఖర్చు: మంత్రి జగదీశ్రెడ్డి
ఎస్సీ ఉప ప్రణాళిక కింద 2015-16లో కేటాయించిన రూ. 8,089.24 కోట్లలో రూ. 3,773.33 కోట్లు ఖర్చు చేశామని, ప్రభుత్వ సాయం వల్ల 48,98,069 మంది ఎస్సీలు లబ్ధిపొందారని రాష్ట్ర ఎస్సీల అభివృద్ధి, విద్యుత్శాఖల మంత్రి జి. జగదీశ్రెడ్డి తెలిపారు. గిరిజన ఉప ప్రణాళిక కింద కేటాయించిన రూ. 5,035.687 కోట్లలో రూ. 2,671.67 కోట్లు ఖర్చుపెట్టామని, దీనివల్ల 15,38,726 మంది ఎస్టీలు లబ్ధి పొందారని ఈ అంశంపై సభ్యులు సండ్ర వెంకట వీరయ్య, ఆర్. కృష్ణయ్య, ఎ.రేవంత్రెడ్డి, సున్నం రాజయ్య, మల్లు భట్టి విక్రమార్క, జెట్టి గీత, ఎస్.ఎ సంపత్ కుమార్, చల్లా వంశీచంద్రెడ్డి, నల్లమోతు భాస్కర్రావు, తమ్మన్నగారి రామ్మోహన్రెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, రవీంద్ర కుమార్ రమావత్ల ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. విద్యుత్ పొదుపు చర్యల కోసం ఎల్ఈడీ బల్బుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో డిమాండ్ సైడ్ ఎనర్జీ ఎఫీషియన్సీ ప్రోగ్రాం (డీఈఎల్పీ)ను అమలు చేస్తున్నామని సభ్యులు సతీశ్ కుమార్, బానోత్ మదన్లాల్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, ఎస్.సత్యనారాయణ, వేముల వీరేశం, చల్లా ధర్మారెడ్డి, డి.కె అరుణల ప్రశ్నలకు జగదీశ్రె డ్డి సమాధానమిచ్చారు.
ఉర్దూ బడులకు మౌలిక సదుపాయాలు: కడియం
రాష్ట్రంలోని 1,571 ఉర్దూ మాధ్యమ పాఠశాలలకుగాను 219 పాఠశాలలు మౌలిక సదుపాయాలతో ఉన్న ప్రైవేటు భవనాల్లో నడుస్తున్నాయని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. 1:25 దామాషాలో ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య ఉందన్నారు. స్థల లభ్యత ప్రాతిపదికన పాఠశాలల భవనాలను నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయని ఈ అంశంపై ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్, ముంతాజ్ఖాన్, మొజంఖాన్, జాఫర్ , అహ్మద్ పాషా ఖాద్రీ, అహ్మద్ బలాలా లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ఉద్యానవన కార్పొరేషన్: పోచారం
ఉద్యానవనాలు, పూల పెంపకం, కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానవన కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. సభ్యులు మనోహర్రెడ్డి, చింతా ప్రభాకర్, వేముల వీరేశంల ప్రశ్నలకు ఆయన ఈ మేరకు బదులిచ్చారు. రాష్ట్రంలో 1.28 కోట్ల గొర్రెలు, 46.75 లక్షల మేకల యూనిట్లను మంజూరు చేశామని ఎమ్మెల్యే ఎ.అంజయ్య అడిగిన ప్రశ్నకు పోచారం సమాధానమిచ్చారు.
వెయ్యి పంచాయతీలకు కొత్త భవనాలు
Published Mon, Mar 14 2016 1:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement