
వారిది దోచుకో.. దాచుకో.. పద్ధతి: కోలగట్ల
రాష్ట్రాన్ని పెద్ద బాబు దోచుకుంటూ ఉంటే చినబాబు దాచుకునే పనిలో పడ్డారని, ప్రజల గురించి అసలు పట్టిం చుకోవట్లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ధ్వజమెత్తారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని పెద్ద బాబు దోచుకుంటూ ఉంటే చినబాబు దాచుకునే పనిలో పడ్డారని, ప్రజల గురించి అసలు పట్టిం చుకోవట్లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి ధ్వజమెత్తారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంవద్ద మీడియాతో మాట్లాడుతూ ప్రజాసంక్షేమ పథకాలేవీ రాష్ట్రంలో అమలు జరగట్లేదని, ‘దోచుకో...దాచుకో...’ అనే ఒక్క పథకం మాత్రమే దిగ్విజయంగా సాగుతోందని వ్యంగ్యంగా అన్నారు. ఉచితంగా ఇసుక ఇస్తామనే విధానంతో కిందిస్థాయి నుంచీ టీడీపీ కార్యకర్తలు దోచుకోవడానికి అవకాశం కల్పించారన్నారు.