► అమెరికాలో కేటీఆర్ రెండోరోజు పర్యటన
► జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ
► రాష్ట్రంలో టీబీ నిర్మూలనకు ఒప్పందం
► డయేరియా నిర్మూలనకు మెర్క్ కంపెనీ చేయూత
► రాష్ట్రంలో వ్యాక్సిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు సుముఖత
► పలు కంపెనీలతో ఎంవోయూలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ రోగాల నిర్మూలనకు ప్రపంచ ప్రఖ్యాత ఔషధ కంపెనీలు ప్రభుత్వంతో చేతులు కలిపాయి. టీబీ రహిత రాష్ట్రంగా మార్చేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. పెట్టుబడుల సమీకరణలో భాగంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికాలో శుక్రవారం రెండోరోజు పర్యటించారు. ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ ఫార్మాస్యూటికల్ విభాగ చైర్మన్ పాల్ స్టోఫెల్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది భారత్ పర్యటనలో భాగంగా తెలంగాణకు రానున్నట్లు పాల్ తెలిపారు. ఫార్మాసిటీ పట్ల ఆసక్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జాన్సన్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ సీఈవో మెలిండా పేర్కొన్నారు.
మరో ఫార్మా దిగ్గజమైన మెర్క్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు సనత్ ఛటోపాధ్యాయతో కూడా కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో డయేరియా మహమ్మారిని నిర్మూలించేందుకు తమ సహకారాన్ని అందిస్తామని సనత్ హామీనిచ్చారు. అలాగే పలు సేవా కార్యక్రమాలను రాష్ట్రంలో విస్తృతపరుస్తామని చెప్పారు. వచ్చేనెలలో హైదరాబాద్లో పర్యటిస్తామని, స్థానిక సంస్థలతో కలిసి నగరంలో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని మంత్రికి వివరించారు. వాక్సిన్ ఎక్సలెన్స్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కూడా కంపెనీ సిద్ధంగా ఉందన్నారు. దీనిద్వారా వ్యాక్సిన్ తయారీ రంగంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
అనంతరం ఫైజర్ కంపెనీ గ్లోబల్ హెడ్ నానెట్ సొనెరో బృందంతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ కోసం ఏరా్పాటు చేసిన ఇకో ప్రాజెక్టు వివరాలను మంత్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (ఆర్ఐసీహెచ్) ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కేటీఆర్ వారిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఐవీ2 అలియెన్స్తో మరో ఎంవోయూ కుదుర్చుకుంది. మెడికల్ అండ్ హెల్త్కేర్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆవిష్కరణలను ఒకచోటుకు తీసుకురావడం ఈ ఎంవోయూ ఉద్దేశం.
నగరంలో ‘జాన్సన్’ ల్యాబ్
Published Sat, Oct 15 2016 2:43 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ప్రశాంత పోలింగ్కు పటిష్ట చర్యలు
టీడీపీ చీప్ ట్రిక్స్
డబ్బు పంపిణీపై దృష్టి పెట్టిన అభ్యర్థులు
అద్భుతంగా చందనోత్సవం: స్వరూపానందేంద్ర సరస్వతి
ఎలక్షన్ స్పెషల్స్!
స్టీల్ప్లాంట్పై ప్రకటన చేస్తే పోటీకి దూరం
కేజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ సరెండర్
పతంగుల పోటీలో ఘోరం.. గొంతు తెగి ఆరుగురు విలవిల.. 35 మందికి గాయాలు!
ఐటీతో రాజకీయ కుట్ర
నేటితో ప్రచారానికి తెర
తప్పక చదవండి
- సమంత వద్ద జాబ్ చేయాలనుకుంటున్నారా..? ఇలా సంప్రదించండి
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
- 27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- పసిడికి అక్షయ తృతీయ శోభ
- CM Jagan: కదిలించిన కడప చైతన్యం
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement