హైదరాబాద్ నగర అభివృద్ధి, రోడ్ల విస్తరణపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నాడు సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్ నగర అభివృద్ధి, రోడ్ల విస్తరణపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నాడు సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగర విస్తృతిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి పనులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్, విద్యుత్, జల మండలి శాఖల మధ్య సమన్వయం అవసరమని మంత్రి వారికి సూచించారు. ఈ సమీక్షలో మెట్రో రైలు సీఎండీ గాడ్జిల్, సంబంధిత శాఖల ముఖ్య అధికారులు ఈ సమీక్షకు హాజరై మంత్రి కేటీఆర్ తో పలు కార్యక్రమాలపై చర్చించారు.