గవర్నర్ను కలిసిన కేసీఆర్ దంపతులు | kcr met governer narasimhan | Sakshi
Sakshi News home page

గవర్నర్ను కలిసిన కేసీఆర్ దంపతులు

Dec 14 2015 7:13 PM | Updated on Aug 15 2018 9:30 PM

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం సాయంత్రం సతీసమేతంగా రాజ్ భవన్కు వెళ్లి ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను కలిశారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం సాయంత్రం సతీసమేతంగా రాజ్ భవన్కు వెళ్లి ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ తలపెట్టిన ఆయత చండీ మహా యాగంలో పాల్గొనాల్సిందిగా గవర్నర్ను కేసీఆర్ దంపతులు ఆహ్వానించారు. మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామంలో ఈ నెల 23 నుండి 27 వరకు కేసీఆర్ చండీయాగాన్ని నిర్వహిస్తున్నారు. నేడు ఉదయం విజయవాడకు వెళ్లిన కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి యాగానికి ఆహ్వానించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement