ఇబ్రహీంపట్నం రూరల్: భార్య ప్రవర్తన బాగలేదని మనోవేదనకు గురైన ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ మధన్లాల్ కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం తోపుచర్లకు చెందిన ఆరెండ్ల కృష్ణారెడ్డి(35), స్రవంతి దంపతులకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరు సరూర్నగర్ మండలం మీర్పేట్లోని ప్రశాంత్హిల్స్లో ఉంటున్నారు. కృష్ణారెడ్డి ఓ బీమా కంపెనీలో ఏజెంట్. స్రవంతి సోమాజిగూడలో ఉన్న ఓ సాప్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. పెళ్లి అయినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కట్నం కూడా కొంత రావాల్సి ఉందని కృష్ణారెడ్డి భార్యతో తగువులాడుతుండేవాడు. రెండు నెలల క్రితం స్రవంతి చెల్లెలు భర్త మృతిచెందాడు. అప్పటినుంచి ఆమె వీరి వద్దే ఉంటుంది.
ఈ క్రమంలో గొడవలు మరింత పెరిగాయి. ఇదిలా ఉండగా, స్రవంతి తన కంపెనీలోని తోటి ఉద్యోగులతో తరచూ ఫోన్లో మాట్లాడటం కృష్ణారెడ్డికి నచ్చకపోయేది. ఈ నేపథ్యంలో అతడు గతంలోనూ రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర మనోవేదనకు గురైన కృష్ణారెడ్డి గురువారం ఉదయం ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూర్లోని నారాయణ జూనియర్ కాలేజీ ఎదుట ఉన్న ఓ చెట్టు ఎక్కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని కిందికి దించి పరిశీలించగా అతడి ప్యాంట్ జేబులో ఓ సూసైడ్ నోట్ లభించింది. దాని ద్వారా పైవివరాలు తెలిశాయి. ఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణారెడ్డి, భార్య, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
భార్య అలా ప్రవర్తించడం చూడలేక...
Published Wed, Mar 23 2016 7:19 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 World Cup 2024: చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
మరికొన్ని గంటల్లో యాపిల్ ‘లెట్ లూస్ ఈవెంట్’
ముస్లిం సమాజం మారాలి: ప్రధాని మోదీ విజ్ఞప్తి
వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి
కేజ్రీవాల్కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!
ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్
వ్యవస్థలను మేనేజ్ చేసేది చంద్రబాబే: ఎమ్మెల్సీ లేళ్ల
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement