ఎస్సై ఆత్మహత్య ఘటనపై హెచ్చార్సీ ఆగ్రహం | HRC outraged on SI suicide incident | Sakshi
Sakshi News home page

ఎస్సై ఆత్మహత్య ఘటనపై హెచ్చార్సీ ఆగ్రహం

Aug 19 2016 5:23 PM | Updated on Nov 6 2018 8:04 PM

ఆత్మహత్య చేసుకున్న కుకునూర్‌పల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్య ఘటనపై మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్న కుకునూర్‌పల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్య ఘటనపై మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర నివేదిక అందివ్వాలని హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, డీజీపీలకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30 లోగా నివేదిక అందించాలని ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement