ఓట్ల కోసం భారీగా నగదు,
బహుమతులు పంపిణీ
లిక్కర్కే లక్షలు వెచ్చించిన అభ్యర్థులు
సిటీబ్యూరో: బల్దియా ఎన్నికల్లో భారీగా నగదు, నజరానాల పంపిణీతో రాజకీయ పార్టీ లు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ప్రతి వీధి, బూత్ పరిధిలో ఇదే తంతు. వివిధ పార్టీల ఏజెంట్లు మూడో కంటికి తెలియకుండా ఓటర్లను, మహిళా గ్రూపులను నేరుగా కలుసుకొని నగదు పంపిణీ చేశారు. మరి కొందరు వారి అకౌంట్ నెంబర్లకు నేరుగా నిధులు బదిలీ చేశారు. మురికివాడల్లో స్థానిక బస్తీ లీడర్ల చేతుల మీదుగా ఓటుకు కనిష్టంగా రూ.500 నుంచి రూ.2 వేల వరకు పంపిణీ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక పురుష ఓటర్లకు విందు వినోదాలు సరేసరి. అపార్ట్మెంట్లు, కాలనీ సంక్షేమ సంఘాలు ఈ పార్టీలకు వేదికగా మారాయి. మహిళా ఓటర్లను మెప్పిం చేందుకు చీరలు, గాజు లు, వెండి కుంకుమ భరిణెలు, డిన్నర్సెట్లు, మిక్సీ లు, వంట పాత్రలు, గృహోపకరణాలు పంపిణీ చేశా రు. యువ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు క్యారమ్స్, చెస్ బోర్డులు, క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. స్థానికంగా ఎక్కడికిక్కడే నివాసం ఉండే తమ పార్టీ నేతలతో ఈ కార్యక్రమాలను చేపట్టడం విశేషం.
లిక్కర్కు రూ.లక్షలు
ప్రధాన పార్టీల అభ్యర్థులు మద్యం కొనుగోలుకు రూ. లక్ష ల్లో ఖర్చు చేశారు. ఒక్కో అభ్యర్థి గత పది రోజు లుగా మద్యం కొనుగోలుకే రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వెచ్చించి నట్లు అనధికారిక అం చనా. నగర శివార్లలో ఒక్కో డివిజన్కు సుమారు రూ.కోటి విలువైన మద్యాన్ని అభ్యర్థులు మందుబాబులకు పంపిణీ చేయడం గమనార్హం. వీరంతా ఇంతగా కష్టపడినా వారు ఆశించిన స్థాయిలోఓట్లు పడతాయా అన్నదే ఇప్పు డు మిలియన్ డాలర్ల ప్రశ్న.
బస్తీ నేతలకు తాయిలాలు..
కొందరు అభ్యర్థులు కుల సంఘాలు, బస్తీల్లోని చోటా మోటా నేతలను పిలిపించుకొని ఏకమొత్తంగా డబ్బులిచ్చినట్లు సమాచారం. డబ్బు తీసుకునేందుకు ఇష్టపడని కాలనీలకు మాత్రం అక్కడున్న ప్రధాన సమస్యను పరిష్కరించేందుకు అయ్యే మొత్తాన్ని భరిం చేలా హామీ ఇచ్చి ఒప్పందం చేసుకొన్నట్లు వినికిడి. మినీ వాటర్ ట్యాంకులు, బోర్లు నిర్మించేలా మరి కొం దరు ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. చిన్న, మధ్యతరగతి వర్గాల వారున్న ప్రాంతంలో మద్యం, మాంసంతో కూడిన విందులు ఏర్పాటు చే సి ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు యత్నించారు. మరికొం దరు ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వర కూ ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.
స్వయం సహాయక సంఘాల మహిళల లీడర్లను కలిసి ఓట్ల లెక్కన కొంతమొత్తం చెల్లించినట్టు సమాచారం. నేరుగా తీసుకోని గ్రూపులకు వారి బ్యాంకు ఖాతాల్లో వేశారు. మరి కొందరు అభ్యర్థులు కిరాణా దుకాణాలు, వైన్ షాపుల్లో కొంత డబ్బు డిపాజిట్ చేసి పక్కాగా ఓటు వేస్తామని చెప్పిన వారికి కోడ్ లాంగ్వేజ్లో ఉన్న చిన్న స్లిప్ రాసి ఇచ్చారు. వీటి ఆధారంగా పంపిణీలు జరిగిపోయాయి.
నజరానాల వాన!
Published Tue, Feb 2 2016 1:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement