ఈదురుగాలు, వడగండ్లతో కూడిన వర్షాలు మంగళవారం మధ్యాహ్నం తెలంగాణలో పలు చోట్ల బీభత్సం సృష్టించాయి.
ఈదురుగాలు, వడగండ్లతో కూడిన వర్షాలు మంగళవారం మధ్యాహ్నం తెలంగాణలో పలు చోట్ల బీభత్సం సృష్టించాయి. హైదరాబాద్లో పాతబస్తీ, ఎల్బీనగర్, మలక్పేట, దిల్సుఖ్నగర్తో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచాయి. మెదక్ జిల్లా దుబ్బకలో వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. రంగారెడ్డిజిల్లా శంషాబాద్ మండలంలోని కవ్వగూడలో పిడుగు పడి ఒక మహిళ మృతి చెందింది. ఇదే ఘటనలో మరో మహిళ తీవ్రంగా గాయపడింది. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.