రూ.4.53 కోట్ల బంగారం ‘లాక్కుపోయారు’! | Gold Rs .4.53 'dragged'! | Sakshi
Sakshi News home page

రూ.4.53 కోట్ల బంగారం ‘లాక్కుపోయారు’!

Jan 5 2014 3:45 AM | Updated on Sep 2 2017 2:17 AM

రూ.4.53 కోట్ల బంగారం ‘లాక్కుపోయారు’!

రూ.4.53 కోట్ల బంగారం ‘లాక్కుపోయారు’!

చైన్ స్నాచింగ్...పోలీసు దృష్టిలో ఇది ఒక బంగారు గొలుసు చోరీ కేసు మాత్రమే. సా మాన్యుడికి మాత్రం కొన్ని నెలల కష్టార్జీతం... మహిళలకు సెంటిమెంట్.

=నగరంలో పేట్రేగుతున్న చైన్‌స్నాచర్లు
 =నానాటికీ పెరిగిపోతున్న కేసులు సంఖ్య
 =‘ఉపశమనం’ లభిస్తున్నది సగం మందికే
 =కట్టడి చేయలేక తలలు పట్టుకుంటున్న పోలీసులు

 
సాక్షి, సిటీబ్యూరో: చైన్ స్నాచింగ్...పోలీసు దృష్టిలో ఇది ఒక బంగారు గొలుసు చోరీ కేసు మాత్రమే. సా మాన్యుడికి మాత్రం కొన్ని నెలల కష్టార్జీతం... మహిళలకు సెంటిమెంట్. ఎప్పటికప్పుడు తమ పంథా మార్చుకుంటూ సిటీలో రెచ్చిపోతున్న స్నాచర్లు ప్రజలతో పాటు పోలీసులకూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు. గతేడాది (2013)లో వివిధ నేరాల్లో నగరవాసులు కో ల్పోయిన మొత్తం రూ.42.66 కోట్లు కాగా... ఇందులో స్నాచర్లు‘లాక్కుపోయింది’రూ. 4.53 కోట్లకు పైగా ఉంది. అంటే... మొత్తం పోయిన సొత్తులో 10.62 శాతం. పోలీసు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న వీరికి కట్టడి చేయడంలో ఘో రంగా విఫలమతువున్న అధికారులు ఏం చే యాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు.
 
విద్యార్థులతో సహా కొత్తవారెందరో...
 
స్నాచింగ్ చేసేటప్పుడు, ఆ తర్వాత పట్టుబడే అవకాశాలు తక్కువగా ఉండటం, మార్కెట్‌లో బంగారం ధరలు జెట్ కంటే స్పీడ్‌తో దూసుకుపోతుండటంతో పాత నేరస్తులే కాదు... కొత్తవారూ స్నాచర్లుగా మారుతున్నారు. ఎలాంటి నేరచరిత్ర లేని వారు, విద్యార్థులు కూడా దురలవాట్లకు బానిసలై స్నాచింగ్‌ల బాట పడుతున్నారు. ఇది పోలీసులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. కొత్త దొంగల వివరాలు, వేలిముద్రలు వంటి సమాచారం పోలీసు రికార్డుల్లో ఉండకపోవడంతో వీరిని గుర్తించడం, పట్టుకోవడం కష్టమవుతోంది. దీంతో పోలీసులకు చిక్కేవరకు నేరాలు చేస్తున్నారు.
 
పోలీసు యాక్షన్... స్నాచర్ల రియాక్షన్...
 
స్నాచింగ్స్‌ను అరికట్టేందుకు పోలీసులు వేస్తున్న ఎత్తులకు స్నాచర్లు పైఎత్తులు వేస్తున్నారు. చోరీలు జరిగే ప్రాంతాల్లో మఫ్టీ పోలీసుల్ని మోహరించడంతో పాటు మహిళా పోలీసులే సాధారణ దుస్తుల్లో నగలు ధరించి వెళ్తూ డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.  ఇది గమనించిన దొంగలు పోలీసుల ఎత్తులకు పైఎత్తు వేసి.. తాము స్నాచింగ్ చేయబోయే ప్రాంతంలో ముందుగా తమ ముఠా సభ్యులతో రెక్కీ చేయించి పరిస్థితులను గమనించి తర్వాత పంజా విసురుతున్నారు.  కొన్నిసార్లు ఇళ్ల వద్ద ఉన్న మహిళల మెడలోని గొలుసులు తెంచుకుపోతున్నారు.  ముఖ్యంగా పశ్చిమ, తూర్పు మండలాలతో పాటు సైబరాబాద్‌లోనూ వీరి బెడద ఎక్కువగా ఉంటోంది.
 
సగం కూడా కొలిక్కిరాని వైనం...
 
అసలే నగరంలో జరుగుతున్న వరుస దోపిడీలు, దొంగతనాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న పోలీసులకు స్నాచింగ్స్ కొత్త తలనొప్పుల్ని తెచ్చిపెడుతున్నాయి.  వీరిని పట్టుకోవడం, కట్టడిచేయడంలో సఫలీకృతులు కాలేకపోతున్నారు. గడిచిన మూడేళ్లలో నగర కమిషనరేట్ పరిధిలో 2250 స్నాచింగ్ కేసులు నమోదు కాగా... వీటిలో కొలిక్కి చేరినవి కేవలం 995 మాత్రమే. మిగిలిన బాధితులకు న్యాయం జరగలేదు.  2005లో 332గా ఉన్న స్నాచింగ్స్ సంఖ్య గతేడాది 742కు చేరింది. చిక్కుతున్న నేరగాళ్లకూ కోర్టులో శిక్ష పడేలా చేయడంలో పోలీసులు విఫలం అవుతున్నారు. ఏటా నమోదవుతున్న స్నాచింగ్ కేసుల్లో నేరం నిరూపితమవుతున్నవి 20 శాతానికి మించట్లేదు.

 ‘దోపిడీ’ నమోదుకు వెనుకడుగు...
 
స్నాచర్స్‌ను పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి పోలీసులు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కోణంలో పోలీసులు ఆలోచిస్తున్న దాఖలాలు లేవు. స్నాచింగ్‌కు పాల్పడి చిక్కిన వారిపై ప్రస్తుతం ఐపీసీలోని 379 (చోరీ) సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తుండటంతో తేలిగ్గా బెయిల్ పొందుతున్నారు. జైలు నుంచి వచ్చి మళ్లీ చోరీలు చేస్తున్నారు.  నేరగాళ్లకు తేలిగ్గా బెయిల్ దొరక్కుండా ఉండటానికి ఇకపై స్నాచింగ్ తీరుతెన్నులను బట్టి దోపిడీ కేసు (ఐపీసీ 392) నమోదు చేయాల్సి ఉంది. ఓ వ్యకి పరోక్షంలో అతడికి చెందిన వస్తువును అనుమతి లేకుండా తీసుకుంటే చోరీ. ఆ వ్యక్తిని బెదిరించి, భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా ఎత్తుకుపోతే అది దోపిడీ. స్నాచింగ్ కూడా ఈ కోవకు చెందిన నేరమే కావడంతో దోపిడీగా కేసు నమోదు చేస్తే నిందితుడికి కఠిన శిక్షపడే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement