గంజాయి తరలిస్తున్న ఐదుగురిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి పట్టివేత
Jul 21 2017 10:50 AM | Updated on Sep 5 2017 4:34 PM
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుంచి దేశ రాజధానికి గంజాయి తరలిస్తున్న ఐదుగురిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 45 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు నుంచి సికింద్రాబాద్ మీదుగా ఢిల్లీకి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. జీఆర్పీ పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.
Advertisement


