ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి వెళ్లి.. | four youth arrested in woman harassment in hyderabad | Sakshi
Sakshi News home page

ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి వెళ్లి..

Dec 21 2015 9:07 AM | Updated on Sep 4 2018 5:07 PM

ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి ప్రవేశించిన యువకులు ఆమెను లైంగికంగా వేధించడంతో పాటు దౌర్జన్యం చేశారని ఫిర్యాదు అందడంతో నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

కుత్బుల్లాపూర్: ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి ప్రవేశించిన యువకులు ఆమెను లైంగికంగా వేధించడంతో పాటు దౌర్జన్యం చేశారని ఫిర్యాదు అందడంతో నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ భాగ్యలక్ష్మీకాలనీలో ఆదివారం చోటుచేసుకుంది.

స్థానిక కాలనీలో నివాసముంటున్న మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే ఇంటి పై అంతస్తులో అద్దెకు ఉండే నలుగురు యువకులు ఈ నెల 18న ఆమెతో అసభ్యంగా మాట్లాడటంతో పాటు ఇంటి లోపలికి వెళ్లి ఆమెను లైంగికంగా వేధించారు. దీంతో బాధితురాలి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement