నలుగురు పోలీసులపై సస్పెన్షన్‌ వేటు | four Hyderabad police suspended | Sakshi
Sakshi News home page

నలుగురు పోలీసులపై సస్పెన్షన్‌ వేటు

Feb 17 2017 4:31 PM | Updated on Mar 19 2019 6:01 PM

నలుగురు పోలీసులను రాజకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ సస్పెండ్‌ చేశారు.

హైదరాబాద్‌: వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే విజయ్‌, మహేశ్‌ అనే ఇద్దరు ఎస్‌ఐలతో పాటు శివరాం, అశోక్‌ అనే ఇద్దరు కానిస్టేబుళ్లను రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ సస్పెండ్‌ చేశారు. సూర్యాపేటలో ఇద్దరు ఎస్‌ఐలు పబ్లిక్‌ ప్లేస్‌లో లిక్కర్‌ తాగి కానిస్టేబుళ్లతో గొడవపడినందుకు వారిని సస్పెండ్‌ చేసినట్లు సీపీ తెలిపారు. లోక్‌అదాలత్‌లో కాంప్రమైజ్‌ కావడానికి ఇద్దరు కానిస్టేబుళ్లు డబ్బులు డిమాండ్‌ చేసినందుకు వారిని సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, ఎంతటి వారినైనా తప్పు చేస్తే వదిలే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement