విషం తాగి కుటుంబం ఆత్మహత్య | Father, Mother attempts suicide along with son in Hyderabad | Sakshi
Sakshi News home page

విషం తాగి కుటుంబం ఆత్మహత్య

Nov 22 2014 10:19 AM | Updated on Nov 6 2018 7:56 PM

చేసిన అప్పులు తీరడం లేదు... వాటికి వడ్డీలు మాత్రం పెరిగిపోతున్నాయి.

హైదరాబాద్: చేసిన అప్పులు తీరడం లేదు... వాటికి వడ్డీలు మాత్రం పెరిగిపోతున్నాయి. అప్పలు తీర్చాలని ఒత్తిడి రోజురోజూకు అధికమవుతుంది. రోజు గడవడమే కష్టంగా ఉంది. ఇంకా అప్పులు ఏలా తీరుస్తామనుకున్నట్లు ఉన్నారు.  దాంతో మరణమే శరణ్యమని ఆ కుటుంబం భావించింది. అంతే ఆ కుటుంబంలోని భార్యాభర్తతోపాటు కుమారుడు విషం తాగి మరణించారు.

ఆ ఘటన నగర శివారుల్లోని కుషాయిగూడ నాగార్జున నగర్ కాలనీలో శుక్రవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. శనివారం ఉదయం స్థానికులు ఆ విషయాని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నాగార్జున నగర్ కాలనీలోని మృతుల ఇంటికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement