సీఎం కార్యాలయం వద్ద కలకలం | Sakshi
Sakshi News home page

సీఎం కార్యాలయం వద్ద కలకలం

Published Thu, Jul 13 2017 6:21 PM

family attempts suicide in cm camp office



హైదరాబాద్‌:

పంజాగుట్టలోని సీఎం క్యాంపు ఆఫీస్ ముందు ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. నల్లగొండ జిల్లాకు చెందిన నాగరాజు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సీఎం కార్యాలయం వద్దకు కూతురు నవ్య(13), మేనల్లుడు శ్రీనివాస్(18)తో కలిసి వచ్చారు. సీఎం లేకపోవడంతో పాటు, కార్యాలయంలోకి సిబ్బంది అనుమతించలేదు.

దీంతో ముగ్గురు కలిసి తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగారు. విషయం గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే వారిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి  తరలించారు. గాంధీలో వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement