
జిల్లాకో పరిశ్రమ అవసరం: తమ్మినేని
రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యను తీర్చాలని...
సూర్యాపేట: రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్యను తీర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాకో ప్రత్యేకత ఉందన్నారు. ఉపాధిరహిత అభివృద్ధికికాకుండా ఉపాధి సహిత అభివృద్ధికి పెద్దపీట వేయాలని తమ్మినేని ప్రభుత్వానికి సూచించారు.