
బలహీనపడుతున్న వాయుగుండం
రాష్ట్రంలో రానున్న మూడు రోజులు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జార్ఖండ్లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. అది కాస్తా బలహీనపడే అవకాశాలున్నాయి. తిరిగి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం పెద్దగా ఉండబోదని పేర్కొంది.