హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్ సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. సోమవారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ రాజీవ్ శర్మ భేటీయ్యారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై కలెక్టర్లతో ఆయన చర్చ జరపనున్నారు.
ప్రస్తుతమున్న జిల్లాలన్నీ రెండు లేదా మూడు జిల్లాలుగా పునర్విభజించే ఆలోచనలో ప్రభుత్వముంది. ప్రతిపాదిత కొత్త జిల్లాలు, డివిజన్లు, కొత్త మండలాలపై నివేదికలు, వాటి భౌగోళిక స్వరూపం, నమూనా మ్యాపులను కలెక్టర్లు రూపొందించారు. ఈ ప్రక్రియకు నిర్దేశించిన రోడ్ మ్యాప్పై జిల్లా కలెక్టర్లతో రాజీవ్ శర్మ ప్రధానంగా చర్చిస్తారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ దీనిపై కలెక్టర్లకు నిర్వహించిన వర్క్షాప్లో దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే.
కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎస్తో కలెక్టర్ల భేటీ
Published Mon, Jun 20 2016 11:40 AM
Related news
-
నీ స్థాయి ఎంత? నువ్వేం చేయగలవు?
భోపాల్: నీ స్థాయి ఎంత? నువ్వేం చేయగలవు? అంటూ ట్రక్కు డ్రైవర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్పై బదిలీ వేటు పడింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం షాజాపూర్ జిల్లాలో జరిగింది. న్యాయ సంహిత బిల్లులోని హిట్ అండ్ రన్ నిబంధనలను వ్యతిరేకిస్తూ ట్రక్కు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. విధులను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో డ్రైవర్ల సంఘం ప్రతినిధులతో షాజాపూర్ కలెక్టర్ కిశోర్ కన్యాల్ మంగళవారం సమావేశమయ్యారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తగదని, విధుల్లో చేరాలంటూ వారిని హెచ్చరించారు. తమతో సక్రమంగా మాట్లాడాలని ఓ ప్రతినిధి చెప్పగా, కలెక్టర్ ఆగ్రహానికి గురయ్యారు. నీ స్థాయి ఎంత? అంటూ మండిపడ్డారు. తమకు ఏ స్థాయి లేదు కాబట్టే ఈ పోరాటం చేస్తున్నామని ఆ ప్రతినిధి బదులిచ్చాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహారం సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశాల మేరకు కలెక్టర్ కిశోర్ కన్యాల్ను ఆ పదవి నుంచి తొలగింగి, రాష్ట్ర డిప్యూటీ సెక్రెటరీగా బదిలీ చేసినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. -
అధికారులు, జిల్లా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే అనిల్ కుమార్
అధికారులు, జిల్లా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ -
నేడే మద్యం లాటరీలు
సాక్షి, హైదరాబాద్/జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): రానున్న రెండేళ్ల కాలానికిగాను లైసెన్సుల మంజూరు కోసం నేడు(సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్షాపులకు లాటరీలు నిర్వహించనున్నారు. ఈ నెల 4న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 18వ తేదీన ముగిసిన నేపథ్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ‘డ్రా’తీయనున్నారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో వీడియో చిత్రీకరణ ద్వారా ఈ లాటరీల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా, ఈ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని, లాటరీలో విజేతలకు వెంటనే షాపుల కేటాయింపు ఉత్తర్వులు అందజేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. ఎంట్రీ పాసులు ఉన్నవారిని మాత్రమే డ్రా తీసే ప్రదేశంలోకి అనుమతించాలని, లాటరీ ప్రక్రియ విషయంలో చిన్న పొరపాటు జరిగినా సంబంధిత అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. కాగా, మంత్రి ఆదివారం మహబూబ్నగర్లోని క్యాంప్ కార్యాలయంలో కూడా ఎక్సైజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లాటరీ ప్రక్రియ కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. -
22(ఎ) జాబితా నుంచి.. ఆ భూముల్ని తొలగించవచ్చు
సాక్షి, అమరావతి: పేదలకు 1954వ సంవత్సరానికి ముందు ఇచ్చిన (అసైన్డ్) భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించవచ్చని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు స్పష్టతనిస్తూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ), ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ తాజాగా సర్క్యులర్ జారీచేశారు. కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ తమ జిల్లాలో ఉన్న పరిస్థితిని వివరిస్తూ దీనిపై స్పష్టత ఇవ్వాలని సీసీఎల్ఏని కోరారు. కర్నూలు జిల్లాలో 5,382.78 ఎకరాల ప్రభుత్వ భూమిని 1954 జూన్ 18 నాటికి 2,755 మంది నిరుపేదలకు వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చారని, ఈ భూములను నిషేధిత ఆస్తుల జాబితా 22 (ఎ) 1 నుంచి తొలగించడంపై పలు ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. ఆ భూముల్ని 22 (ఎ) జాబితా నుంచి తొలగించవచ్చా? లేదా? అనే దానిపై తగు సూచనలు ఇవ్వాలని కోరారు. దీనిపై సీసీఎల్ఏ స్పష్టతనిస్తూ 22 (ఎ) కేసులను త్వరితగతిన పరిష్కరించడం కోసం 2022 సెప్టెంబర్ ఒకటో తేదీన జిల్లా కలెక్టర్లకు అన్ని అంశాలపైనా తగిన వివరణలు, సూచనలతో ఒక సర్క్యులర్ ఇచ్చినట్లు తెలిపారు. మరోసారి దీనిపై స్పష్టతనిస్తూ.. 1954 జూన్ 18కి ముందు పేదలకు (డిప్రెస్డ్ క్లాసెస్) షరతులతోగానీ, షరతులు లేకుండా గానీ ఇచ్చిన భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించవచ్చని స్పష్టంచేశారు. ఆ భూములకు సంబంధించిన పట్టాలు అందుబాటులో ఉన్నా, లేకపోయినా రెవెన్యూ రికార్డుల ఆధారంగా సుమోటోగా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. అసైన్డ్ భూముల వ్యవహారంపై తరచూ ప్రశ్నలు వస్తుండడంతో ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఈ సర్క్యులర్ ఇచ్చింది. స్వాతంత్య్రానికి ముందు పేదలకిచ్చిన భూములను 22(ఎ) జాబితా నుంచి తీసివేయాలని గతంలోనే ప్రభుత్వం స్పష్టంచేసినా జిల్లా కలెక్టర్లు, జేసీలు రకరకాల కారణాలు, వివాదాల భయంతో వాటి జోలికి వెళ్లడంలేదు. నిబంధనల ప్రకారం చేయాల్సిన వాటిని కూడా చేయకుండా నాన్చుతున్నారు. అందులో భాగంగానే తమ వద్దకు వచ్చే ఇలాంటి పిటిషన్లపై తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా సీసీఎల్ఏకి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో.. రెవెన్యూ వ్యవస్థకి సంబంధించి అనేక అంశాలపై జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఉన్నాయని సీసీఎల్ఏ తరచూ స్పష్టంచేస్తూనే ఉన్నారు. ఇలాంటి అంశాలపై తామిచ్చిన మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. అందులో భాగంగానే 1954 ముందు పేదలకిచ్చిన భూములను 22 (ఎ) నుంచి నిరభ్యంతరంగా తొలగించవచ్చని తాజా సర్క్యులర్ ఇచ్చారు. -
కర్నూలు తొలి మహిళా కలెక్టర్గా బాధ్యతలు.. డాక్టర్ సృజన ఏమన్నారంటే..
కర్నూలు(సెంట్రల్): ‘‘నేను ఎక్కువగా గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో పనిచేశా. మొదటగా జిల్లాలోని సమస్యలపై అవగాహన పెంచుకుంటా. ఆ తరువాత వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతూ అభివృద్ధిలో జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేస్తా’’ అని జిల్లా నూతన కలెక్టర్ డాక్టర్ జి.సృజన అన్నారు. సోమవారం ఉదయం 9.37 గంటలకు కలెక్టర్ తన చాంబర్లో తొలి మహిళా కలెక్టర్గా సర్వమత ప్రార్థనలు అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు కలెక్టర్గా రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు, రీసర్వేపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే గుడిసెలు లేని రాష్ట్రంగా ఏపీ అవతరిస్తుందన్నారు. రీసర్వేతో వందేళ్ల భూ సమస్యలకు చెక్ పడుతుండడంతో ప్రాధాన్యతగా తీసుకొని పనిచేస్తానన్నారు. ఇక అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని జిల్లాను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తానన్నారు. కార్యక్రమంలో కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ భార్గవ్తేజ, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు, ఆర్డీఓ హరిప్రసాద్, కలెక్టరేట్ ఏఓ వెంకటేశ్, కేఆర్ఆర్సీ ఎస్డీసీ నాగప్రసన్న లక్ష్మీ, డీఆర్డీఏ పీడీ ఎం.వెంకటసుబ్బయ్య, సీపీఓ అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేసినా స్పందిస్తా నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటా.. ప్రజా సమస్యలపై వాటాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేసినా స్పందిస్తా. ఏ అంశంలోనైనా వేగంగా స్పందించడానికే ఇష్టపడతా’’ అని కలెక్టర్ జి.సృజన అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ముందుగా ఒక్కో అధికారిని పరిచయం చేసుకొని పాలనలో తన ప్రాధాన్యత అంశాలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు వ్యవస్థ మీద నమ్మకం కలిగేలా పనిచేయాలన్నారు. అధికారులు సమయ పాలన పాటించకపోయినా, బాధ్యతా రహితంగా వ్యవహరించినా సహించేది లేదని మొదటి సమావేశంలోనే నిక్కచ్చిగా తెలిపారు. నిత్యం ప్రజలకు, అధికారులకు అందుబాటులో ఉంటానని.. ఫైళ్లను ఈ–ఆఫీసులోనే పంపాలని, అప్పుడే వేగంగా పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. ఫైళ్ల నిర్వహణలో సమస్యలు ఉంటే అధికారులు నేరుగా తనకు ఫోన్ చేయవచ్చన్నారు. మండలస్థాయిలోని స్పెషల్ ఆఫీసర్ వ్యవస్థతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేద్దామని పిలుపునిచ్చారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే డాక్టర్ జి.సృజన తనదైన శైలిలో విధి నిర్వహణలో పాల్గొన్నారు. ఉదయం స్పందన, జిల్లా ఉన్నతాధికారుల సమావేశాల్లో తన లక్ష్యాలేమిటో వివరించారు. సాయంత్రం కలెక్టరేట్ సమూదాయంలో ఏ అధికారి కార్యాలయం ఎక్కడుందో పర్యటించి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ‘స్పందన’ కంటితుడుపు కాదు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కంటి తుడుపు కాదని, అధికారులు శ్రద్ధగా పనిచేయకపోతే ఇబ్బందులు తప్పవని జిల్లా కలెక్టర్ జి.సృజన హెచ్చరించారు. మండల, సచివాలయ స్థాయిల్లో పరిష్కారం కావాల్సిన సమస్యలు జిల్లా స్థాయి స్పందనకు రావడంపై ఆమె అధికారులను నిలదీశారు. తీరు మార్చుకోవాలని, బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కొత్త కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె స్పందనలోనే మొదట పాల్గొని ప్రజల నుంచి వినుతులు స్వీకరించారు. స్పందనలో డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు, ఎస్డీసీలు రమా, సీపీఓ అప్పలకొండ, డీఆర్డీఏపీడీ ఎం.వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఏమన్నారంటే.. ► స్పందనలో వచ్చిన 30–40 సమస్యల్లో అధికంగా మండల, గ్రామ, వార్డు సచివాలయాల్లో పరిష్కారం కావాల్సిన చిన్న చిన్న సమస్యలే ఉన్నాయి. సచివాలయ వ్యవస్థ వచ్చి మూడేళ్లవుతున్నా అక్కడ ఎందుకు పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలేదు. ► స్పందనలో వచ్చిన సమస్యల్లో పరిష్కరించే అధికారికి కాకుండా ఇతరులకు పంపితే ఆ ఫిర్యాదు రిజెక్ట్ అవుతుంది. తద్వారా అర్జీదారుడు పదే పదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ► స్పందన సమస్యలను గడువులోపు పరిçష్కరించాలి. తిరస్కరించిన సమస్యలకు తగిన కారణాలతో అర్జీదారుడు సంతృప్తి చెందేలా చూడాలి. ► ‘జగనన్నకు చెబుతాం’ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఈ కార్యక్రమాన్ని సీఎంఓ నుంచి అధికారులు పర్యవేక్షిస్తారు. దివ్యాంగుల దగ్గరికే వెళ్లి అర్జీల స్వీకరణ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ జి.సృజన మొదటి అధికారిక కార్యక్రమం స్పందనలో తన సేవా గుణాన్ని చాటుకున్నారు. స్పందనకు వచ్చిన వికలాంగులు, అంధుల దగ్గరికే వెళ్లి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ‘‘గతంలో స్పందన సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో నాకు తెలియదు. ఇప్పటి నుంచి ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించాలి. లేకపోతే ఏ కారణంతో చేయలేకపోతున్నారో ఎండార్స్మెంట్లో స్పష్టం చేయాలి.’’ – జి.సృజన, జిల్లా కలెక్టర్
Related News by category
-
నామినేషన్ల దాఖలు ఇలా
సార్వత్రిక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. 18వ లోక్సభ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ వెంటనే నామినేషన్లు సైతం స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా...రాజకీయ పార్టీలు సైతం అభ్యర్థులను ప్రకటించి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం పంపిణీ వంటి అంశాలపై ఎన్నికల కమిషన్ గట్టి నిఘా చర్యలు చేపట్టింది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. యువత, మహిళలు, వృద్ధులకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తోంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రిటర్నింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల దాఖలు కోసం ముహూర్తాలను అన్వేషిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో● అభ్యర్థులు నామినేషన్ ఫారం–2ఎను రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి ఉచితంగా పొందవచ్చు. ● ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ● అభ్యర్థి వెంట మరో నలుగురికి మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతిస్తారు. ● జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని ఒక ఓటరు నామినేషన్ను ప్రతిపాదించాలి. అదే రిజిస్ట్రర్ రాజకీయ పార్టీలు/ స్వతంత్ర అభ్యర్థులకు పది మంది ఓటర్లు నామినేషన్ను ప్రతిపాదించాల్సి ఉంది. ● అభ్యర్థులు మూడు నెలల లోపు దిగిన ఒక పాస్పోర్ట్ సైజు ఫొటో అఫిడవిట్పై అతికించాలి. ● నామినేషన్ పత్రంపై స్టాంప్ సైజు ఫొటో అతికించాల్సి ఉంది. ● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వేర్వే పార్లమెంట్ సెగ్మెంట్కు చెందిన వారైనచో విధిగా వారి అసెంబ్లీ సెగ్మెంట్ ఈఆర్ఓ నుంచి ఓటరు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంది. ● రిజస్టర్/ గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ ఫారంలోని పార్ట్ –3లో సి కాలం ఎదురుగా ఎన్నికల సంఘం నిర్ధేశించిన గుర్తుల్లో ఏదైనా మూడు గుర్తులను ప్రాధాన్యతాక్రమంలో ఎంపిక చేసి, ఆ వివరాలను పొందుపర్చాల్సి ఉంది. ● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా తెరవాల్సి ఉంది. ● అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. ● ఎన్నికల వ్యయానికి సంబంధించిన లావాదేవీల నిర్వహణ పక్కాగా నిర్వహించాలి. శుభ ముహూర్తాలు ఇవే.. ● 18 గురువారం దశమి, మగ నక్షత్రం మంచి రోజు కావడంతో అభ్యర్థులు సాదాసీదాగా వెళ్లి నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ● 19న శుక్రవారం, ఏకాదశి, ముఖ నక్షత్రం మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజే నామినేషన్లు వేసేందుకు మెజార్టీ అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు. ● 22 సోమవారం చతుర్థశి, అష్టానక్షత్రం. నామినేషన్ల దాఖలు మంచి రోజు. ● 24న బుధవారం చైత్ర బహుళ పౌడ్యమితో పాటు స్వాతి నక్షత్రం, చాలా బాగుంది. ఈ రోజు నామినేషన్లు సమర్పిస్తే..అంతా మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. జాతకాలతో ముందుకు... ● నిజానికి 21న ఆదివారం త్రయోదశి, ఉత్తర నక్షత్రం..పై ముహూర్తాల కంటే ఇది మెరుగైనది. కానీ ఆ రోజు సెలవు కావడంతో అభ్యర్థులు ముందు రోజుల్లోనే నామినేషన్లు దాఖలు చేయాల్సి వస్తుంది. అభ్యర్థులు సూత్రప్రాయంగా శుభముహూర్తాలను ఖరారు చేసుకున్నా..మరొకసారి తమ జాతక బలానికి అనుగుణంగా నామినేషన్లను దాఖలు చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు రెండు, మూడు ముహూర్తాలను కూడా ఖరారు చేసుకున్నారు. వీటిలో ఏదో ఒక దానిపై తుది నిర్ణయం తీసుకునే వీలుంది. ఆ మేరకు తొలుత ఒక సెట్టు నామినేషన్ వేసే చాన్స్ ఉంది. ● గతంలో నామినేషన్ల కార్యక్రమం చాలా అట్టహాసంగా చేసే వారు. భారీగా జనాన్ని సమీకరించి, ఊరేగింపుగా నామినేషన్లు వేసే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎండలు భగ్గున మండుతుండటంతో పార్టీ శ్రేణులు కూడా బయటికి వెళ్లేందుకు భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరు సాదాసీదాగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ ఇలా ● నేడే లోక్సభ ఎలక్షన్ నోటిఫికేషన్..ఆ వెంటనే నామినషన్ల స్వీకరణ ● 18, 19, 24 తేదీల్లో శుభ ముహూర్తాలు ● నామినేషన్లు వేసేందుకు అభ్యర్థుల ఏర్పాట్లు లోక్సభ స్థానం రిటర్నింగ్ సెంటర్ హైదరాబాద్ కలెక్టరేట్ ఆఫీసు, లక్డీకాపూల్ సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసు (సికింద్రాబాద్) మల్కాజ్గిరి మేడ్చల్ కలెక్టరేట్ చేవెళ్ల తహసీల్దార్ ఆఫీసు, రాజేంద్రనగర్ ● ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ● ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ● సెలవు రోజుల్లో నామినేషన్లు స్వీకరించరు. ● ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ● ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా విడుదల ● మే 13న ఎన్నికల నిర్వహణ, జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ● జూన్ 6న ఎన్నికల ప్రకియ ముగింపు చేవెళ్ల లోక్సభ స్థానం పార్టీ అభ్యరి నామినేషన్ తేదీ బీజేపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి 22 బీఆర్ఎస్ కాసాని జ్ఞానేశ్వర్ 19 కాంగ్రెస్ గడ్డం రంజిత్రెడ్డి 25 హైదరాబాద్ లోక్సభ స్థానం బీజేపీ మాధవీలత 24 బీఆర్ఎస్ జి.శ్రీనివాస్యాదవ్ 22 ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ 19సికింద్రాబాద్ లోక్సభ స్థానం పార్టీ అభ్యరి నామినేషన్ తేదీ బీజేపీ జి.కిషన్రెడ్డి ఏప్రిల్ 19 బీఆర్ఎస్ పద్మారావుగౌడ్ 19 కాంగ్రెస్ దానం నాగేందర్ 24 మల్కాజ్గిరి లోక్సభ స్థానం బీజేపీ ఈటల రాజేందర్ 18 బీఆర్ఎస్ రాగిడి లక్ష్మారెడ్డి 22 కాంగ్రెస్ పట్నం సునీతారెడ్డి 22 కంటోన్మెంట్లోనూ... కంటోన్మెంట్: లోక్సభ ఎన్నికలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి కూడా గురువారం నోటిఫికేషన్ వెలువడనుంది. వెంటనే నామినేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తారు. ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్ అధికారి మధుకర్ నాయక్ తెలిపారు. కంటోన్మెంట్లో 113 ప్రాంతాల్లో 232 పోలింగ్ కేంద్రాలున్నాయని తెలిపారు. ఇక్కడ మొత్తం 2,51,370 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 1,25,735 మంది, మహిళలు 1,25,627 మంది, ఇతరులు 8 మంది, సర్వీసు ఓటర్లు 55 మంది ఉన్నారని చెప్పారు. నామినేషన్లను కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో గురువారం ఉదయం నుంచి స్వీకరిస్తారు. ఇక బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ఉపఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించారు. నామినేషన్ల తర్వాత ప్రచారం ఉధృతం చేసే అవకాశం ఉంది. -
సీతారామం
భాగ్యనగరం..పురానాపూల్ వద్ద శోభాయాత్రలో పాల్నొన్న భక్తులుజై శ్రీరామ్ నినాదాలతో నగరం మార్మోగింది. బుధవారం శ్రీరామనవమి వేడుకలు గ్రేటర్ వ్యాప్తంగా కన్నుల పండువగా జరిగాయి. అన్ని ప్రధాన ఆలయాల్లో రాములోరి పెళ్లి వేడుకల్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కల్యాణం తర్వాత అన్నిచోట్లా అన్నదానం చేశారు. ఇక భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీరాముడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. చారిత్రాత్మక సీతారామ్బాగ్ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర భక్తుల నృత్యాలు, డప్పుచప్పుళ్లు, జెండాలు, ఆటపాటల కోలాహలం మధ్య కోఠి హనుమాన్ టేక్డి వరకు సాగింది. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ధూల్పేట్ గంగాబౌలి, ఆకాష్పురి హనుమాన్ ఆలయం నుంచి, ఆనంద్సింగ్ ఆధ్వర్యంలో మంగళ్హాట్ మాగ్రా నుంచి కూడా శోభాయాత్రలు చేపట్టగా..ఇవి మూడు లక్షలాది మంది రామభక్తుల సందడి మధ్య హనుమాన్ టేక్డికి చేరుకున్నాయి. భారీ శ్రీరాముడు, హనుమాన్ విగ్రహాలు, కాషాయ రంగు జెండాలు, బైకులపై యువత విన్యాసాలతో శోభాయాత్ర ఆద్యంతం అత్యంత కోలాహలంగా జరిగింది. – అబిడ్స్ -
డోర్ నెంబర్లూ డొల్లే !
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓట్లున్న చిత్రాలు తెలుసు. ఇది ఎలా సాధ్యం ? అంటే ఇష్టానుసారం డోర్నెంబర్లతో ఓటరు జాబితాలో పేరు చేరిపోవడం ఒక కారణం. ఒక ప్రాంతంలోని వారందరూ ఓటరుగా నమోదయ్యేటప్పుడు తమ సమీపంలోని వారు ఇచ్చిన డోర్నెంబర్తోనే తమ పేర్లు కూడా నమోదు చేసుకున్న వారున్నారు. ఒక పెద్ద భవనంలోని అద్దెదారులందరూ కూడా ఒకే డోర్నెంబర్తో ఓటర్లుగా నమోదైన వారున్నారు. అంతే కాదు ఇంకొందరైతే జీహెచ్ఎంసీ కేటాయించిన ఇంటినెంబరు కాకుండా తమ ఇష్టానుసారం డోర్ నెంబర్లను వేసిన వారున్నారు. ఒక ఇంటినెంబరుకే అదనంగా చివరన ఎ,బి,సిలు చేర్చడమో లేక బై నెంబర్లు వేయడమో చేసి ఆ ఇంటినెంబరుతోనే ఓటరుగా నమోదయ్యారు. సంబంధిత అధికార యంత్రాంగం సైతం ఆన్లైన్లోనమోదు చేసుకున్నప్పటికీ, ఆఫ్లైన్లో దరఖాస్తు తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం కూడా ఇందుకు కారణమనే ఆరోపణలున్నాయి. ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన యంత్రాంగం గత రెండేళ్లుగా 2022 మార్చి నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు 1,81,405 మంది ఓటర్లు ఇలాంటి ఇంటినెంబర్లతో ఓటర్లుగా ఉన్నట్లు గుర్తించారు.వారిని స్టాండర్డ్ ఇంటినెంబర్లలో లేనివారుగా పేర్కొంటున్నారు. అలాంటి వారిని గుర్తించి సరిచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఒకే కుటుంబం...పోలింగ్ కేంద్రాలెన్నో ! సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఓ కుటుంబంలో భార్యాభర్తలతో పాటు వారిద్దరి పిల్లలకు ఓటు హక్కు ఉంది. అందరి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటేసేందుకు అందరూ కలిసి వెళ్లవచ్చులే అనుకున్నారు.అందరూ ఒకేసారి వెళ్లి, రావచ్చుననుకున్నారు. అందుకు ఒక ఆటోలో వెళ్తే సరిపోతుంది అనుకుంది ఆ మధ్య తరగతి కుటుంబం. ఇంటింటికి వచ్చి ఇచ్చిన పోల్ స్లిప్ చూస్తే కుటుంబంలోని భర్తకు ఒక పోలింగ్ కేంద్రం, భార్యకు మరో పోలింగ్ కేంద్రంలో ఓటు ఉన్నట్లు గుర్తించారు. పిల్లలిద్దరికీ ఒకే లొకేషన్ రావడం కొంతలో కొంత నయం. లొకేషన్ ఒకటే అయినా వారి పోలింగ్ కేంద్రాలు కూడా వేరే. దీంతో పిల్లలిద్దరు మాత్రం పోలింగ్ బూత్దాకా వెళ్లి ఓటేసినా.. భార్యాభర్తలకు చెరో చోట రావడంతో వారు వెళ్లలేదు.ఒక్కొక్కరు ఒక్కో వాహనం సమకూర్చుకోలేకపోవడంతోపాటు కలిసి వెళ్లలేక పోతున్నామనే తలంపుతోనూ వారు ఓటేసేందుకు ఉత్సాహం చూపలేదు. ఇది ఒక్క నియోజకవర్గంలోని ఒక్క కుటుంబం పరిస్థితి మాత్రమే కాదు. ఇలా ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు ఉంటోంది. నగరంలో పోలింగ్ శాతం తగ్గడానికి ఇదీ ఓ కారణం. ఇలా ఎందుకవుతుందో అంతుపట్టలేదు. పోలింగ్ శాతం తగ్గేందుకు ఇదీ ఓ కారణంగా గుర్తించిన జిల్లా ఎన్నికల యంత్రాంగం ఈ పరిస్థితిని చక్కదిద్దే చర్యలకు ఉపక్రమించింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 మే నుంచి నవంబర్ మధ్య ఇలా ఒకే కుటుంబానికి చెందినప్పటికీ వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న 3,60,849 మంది ఓటర్లను కుటుంబమంతటికీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓట్లుండే చర్యలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైతం ఈ ప్రక్రియను కొనసాగించింది. 2024 మార్చి నెలాఖరు వరకు అలా 17,864 మంది ఒకే కుటుంబ ఓటర్లకు ఒకే పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంది. వెరసి మొత్తం 3,78,713 మంది ఓటర్లకు ఒక కుటుంబంలోని వారు ఒకే చోట ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు. డూప్లికేట్ ఔట్ సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో వివిధ కేటగిరీల కింద 5,41,201 ఓట్లను అధికారులు తొలగించారు. జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 54,259 మంది డూప్లికేట్ ఓటర్లతో పాటు మరణించిన ఓటర్లు, చిరునామా మారిన వారు వీరిలో ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ ప్రకటించారు. హైదరాబాద్ మహానగరంలో ఓటర్లకు మించి ఎక్కువ ఓట్లున్నట్లు ఎంతోకాలంగా విమర్శలున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలో వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఓట్లున్నవారితోపాటు వేర్వేరు నియోజకవర్గాల్లోనూ ఓట్లుండటాన్ని రాజకీయపార్టీలు పలు సందర్భాల్లో ప్రస్తావించాయి. ఇలాంటి డూప్లికేట్ ఓటర్ల గురించి ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా డూప్లికేట్ ఓటర్లను గుర్తించే చర్యలు చేపట్టిన జిల్లా ఎన్నికల యంత్రాంగం 2023 జనవరి నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు గుర్తించిన డూప్లికేట్లను తొలగించింది. ఒకే నియోజకవర్గం పరిధిలో ఒకేవిధమైన ఫొటోలు, ఒకే విధమైన పేర్లతో ఒకటి కంటే ఎక్కువ చోట్ల జాబితాలో పేరున్న వారిని గుర్తించి తొలగించారు. అలా 54,259 మంది పేర్లు డూప్లికేట్గా ఉండటాన్ని గుర్తించి తొలగించినట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంది. వారితో పాటు చిరునామా మారినప్పటికీ, మరణించిన వ్యక్తుల పేర్లు కూడా జాబితాలో ఉండటాన్ని గుర్తించి అలాంటి వాటినీ తొలగించారు. వెరసి మొత్తంగా 5,41,201 ఓట్లు తొలగించారు. సాగర్లో ‘పంపింగ్’ ట్రయల్ రన్ షురూ.. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే నాగార్జున సాగర్ జలాశయంలో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరడంతో అత్యవసర పంపింగ్ కోసం జలమండలి ట్రయల్రన్ను ప్రారంభించింది. బుధవారం పుట్టంగండి వద్ద సాగర్ వెనుక జలాల నుంచి నాలుగు ఎమర్జెన్సీ మోటర్ల ద్వారా ట్రయల్ రన్ నిర్వహించారు. సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 508 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుండి నగరానికి నిత్యం 270 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తున్నారు. సాగర్లోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి పుట్టంగండి అప్రోచ్ కెనాల్ ద్వారా నీటిని లిఫ్ట్ చేసి పంప్హౌస్, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారానే నీటిని సేకరిస్తున్నారు. నీటి మట్టం డెడ్స్టోరేజీకి చేరుడంతో సరిగ్గా ఏడేళ్ల తర్వాత అత్యవసర పంపింగ్ చేపట్టారు. పుట్టంగండిలో అత్యవసర పంపింగ్ కోసం జలాశయంలో జీరో పాయింట్ వద్ద మొత్తం పది మోటర్లను ఏర్పాటు చేశారు. మొదటగా 60 క్యూసెక్కుల సామర్థ్యమున్న నాలుగు మోటార్లకు ట్రయల్ రన్ చేపట్టారు. మరో రెండు రోజుల్లో మిగిలిన మోటర్లను కూడా ప్రారంభించేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. ● నగర ఓటరు జాబితాలో వింతలెన్నో ● రెండేళ్లుగా సరిదిద్దుతున్న యంత్రాంగం నగరంలో అయోమయ పరిస్థితి పోలింగ్ శాతం తగ్గుదలకు ఇదీ ఓ కారణం రెండు పేర్లు ఉన్నవారివి, చనిపోయిన, అడ్రస్ మారిన వారి ఓటరు కార్డుల గుర్తింపు హైదరాబాద్ జిల్లాలో 5.41 లక్షల ఓట్ల తొలగింపు మరణించిన వారు47,141చిరునామా మారిన వారు4,39,801డూప్లికేట్లు54,2595,41,201మొత్తం -
28 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం
ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల అరెస్ట్ గచ్చిబౌలి: మత్తుకు బానిసలైన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఎండీఎంఏ డ్రగ్తో పట్టుబడి కటకటాలపాలయ్యారు. మాదాపూర్ ఎస్ఓటీ, మాదాపూర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు దాడి చేసి ఇద్దరు స్నేహితులు ఏపీలోని రాజమండ్రి పట్టణం పాతపేటకు చెందిన కాటూరీ సూర్య కుమార్ (22), బాలాజీపేటకు చెందిన గుత్తుల శ్యామ్ బాబు (22)లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.4.2 లక్షల విలువైన 28 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. సూర్య కుమార్ 2023లో డ్రగ్ సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఇటీవలే జైలు నుంచి వచ్చినా అతను తీరు మారలేదు. రైల్వేలో సీనియర్ సూపరింటెండెంట్గా పని చేస్తున్న వ్యక్తి కుమారుడు సూర్య కుమార్ బెంగళూర్లోని జైన్ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశాడు. బెంగళూర్లో తన స్నేహితుడైన అభి ద్వారా డ్రగ్ స్మగ్లర్ నైజీరియన్ గాడ్ ఆఫ్ సాల్మన్ పరిచయమయ్యాడు. డ్రగ్స్కు అలవాటు పడి విలాసవంతమైన జీవితం కోసం డ్రగ్ పెడ్లర్గా మారాడు. అంతే కాకుండా తన స్నేహితుడైన శ్యామ్ బాబుకు మత్తు అలవాటు చేశాడు. ఈ నెల 14న బెంగళూర్ వెళ్లిన సూర్య కుమార్ గాడ్ ఆఫ్ సాల్మన్ వద్ద 30 గ్రాముల ఎండీఎంఏ కొనుగోలు చేశాడు. 16న తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు. రెండు గ్రాములు ఇద్దరు స్నేహితులు సేవించారు. మిగిలిన 28 గ్రాములను రాజమండ్రిలోని విద్యార్థులకు విక్ర యించాలని ప్లాన్ వేశారు. పోలీసులకు సమాచారం అందడంతో మాదాపూర్లోని చందానాయక్ తండాలోని రాజా రెసిడెన్సీ సమీపంలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా ఎండీఎంఏ సరఫరా చేసిన గాడ్ ఆఫ్ సాల్మన్ పరారీలో ఉన్నాడు. 28 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్తో పాటు రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒక్కో గ్రాము ఎండీఎంఏను రూ.10 వేల నుంచి రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. మాదాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జూబ్లీహిల్స్లో భారీ చోరీ
రూ.70 లక్షల విలువైన నగలు మాయం బంజారాహిల్స్: జూబ్లీహిల్స్లో నివసించే ప్రముఖ వ్యాపారవేత్త డీవీఎస్ సోమరాజు నివాసంలో భారీ చోరీ జరిగింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–62లోని ప్లాట్నెంబర్ 1242 (బి)లో సోమరాజుతో పాటు ఆయన తల్లిదండ్రులు శివరామరాజు, అన్నపూర్ణ, భార్య పద్మసూర్య కుమారి, కుమారులు యశ్వంత్ వర్మ, శివ మితీష్వర్మ ఉంటున్నారు. ఈ నెల 4న వీరంతా ఓ వివాహానికి హాజరై సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత ఆభరణాలను బెడ్రూంలోని అల్మరాలో భద్రపరిచారు. ఈ నెల 15న రాత్రి మరో శుభకార్యానికి వెళ్లే క్రమంలో ఆభరణాలు కోసం చూడగా అల్మరాలో కనిపించలేదు. ఇందులో 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్తో పాటు బంగారు గాజులు, చంద్రహారం, డైమండ్ నెక్లెస్, మరో మూడు గోల్డ్ బిస్కెట్లు ఉన్నాయి. వీటి విలువ రూ.70 లక్షలు ఉంటుందని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఇంట్లో నలుగురు పని మనుషులు ఉంటారని, ఇందులో ఇద్దరు బయటి నుంచి వస్తారని, మరో ఇద్దరు సర్వెంట్ క్వార్టర్స్లో ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిపైనే అనుమానం ఉందన్నారు. చోరీకి గురైన ఆభరణాల పక్కనే ఉన్న రూ.40 లక్షల విలువ చేసే నగలు భద్రంగానే ఉన్నాయన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య జీడిమెట్ల: కుటుంబ కలహాల కారణంగా ఎస్పీఓ పోలీస్ డ్రైవర్ ఉరి వేసుకుని మృతిచెందిన ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసరావు చెప్పిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వరనగర్లో ఉండే గుంటి శ్రీనివాస్ ఆర్మీలో పనిచేసి నాలుగు సంవత్సరాల క్రితం రిటైర్డ్ అయ్యాడు. అనంతరం సైబరాబాద్ కమిషనరేట్లో ఎస్పీఓ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. శ్రీనివాస్కు భార్య భార్గవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 16వ తేదీన రాత్రి శ్రీనివాస్ తన భార్యతో గొడవపడ్డాడు. అనంతరం 17వ తేదీ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో భార్య, పిల్లలను బెడ్రూంలోకి పంపించి బయట నుంచి గడియపెట్టాడు. అనంతరం బయట గదిలో బెడ్షీట్తో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. అనుమానం వచ్చిన భార్గవి తలుపులు తీయాలని ఎంత పిలిచినా పలకలేదు. కిటికీలోంచి చూడగా శ్రీనివాస్ ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో భార్గవి పక్కింటి వారికి ఫోన్ చేయడంతో వారు వచ్చి తలుపులు తీయగా శ్రీనివాస్ అప్పటికే మృతిచెంది ఉన్నాడు. భార్గవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
షూటింగ్... పార్టీయింగ్...
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement