కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య | conistable wife committed suicide in hyderabad | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య

Oct 15 2015 12:12 AM | Updated on Mar 19 2019 9:03 PM

ఓ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం జరిగింది.

చాంద్రాయణగుట్ట: ఓ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....చాంద్రాయణగుట్ట గాంధీబొమ్మ ప్రాంతంలో నివాసం ఉండే జి.ప్రవీణ్ కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా కొనసాగుతున్నాడు. ఉద్యోగం రాకముందు సీఆర్‌పీఎఫ్ క్యాంపస్‌లో ఉండే ప్రవీణ్ తమ పక్క క్వార్టర్‌లో ఉండే పూజ (21)ను 2014 ఫిబ్రవరి 13న ప్రేమ వివాహం చేసుకొని గాంధీ బొమ్మ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇదిలా ఉండగా బుధవారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో ప్రవీణ్ ఇంటికి వచ్చి తలుపు తట్టగా తీయకపోవడంతో అనుమానించి పక్కింటి పై నుంచి ఇంట్లోకి ప్రవేశించి చూడగా పూజ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది.

కొనఊపిరితో ఉంటుందని భావించి ప్రవీణ్ కిందికి దించి చూడగా అప్పటికే మృతి చెంది కనిపించింది. వెంటనే సమాచారం అందుకున్న ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ బారీ ఘటనా స్థలానికి చేరుకొని ఆత్మహత్య జరిగిన తీరును పరిశీలించారు. కాగా విషయం తెలుసుకున్న వెంటనే పూజ తల్లిదండ్రులు సుకన్య, సంగయ్యలు అక్కడికి చేరుకొని బోరున విలపించారు. కాగా కళాశాలకు ఎందుకు వెళ్లడం లేదని పూజను ఆమె తల్లి సుకన్య బుధవారం ఉదయం ఇంటికి వచ్చి మందలించినట్లు తెలిసింది. తమ అల్లుడు కట్నం కోసం వేధించేవాడని ఈ సందర్బంగా పూజ తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement