ఈ నెల 27కు ఓటుకు కోట్లు కేసు వాయిదా | cash for vote case adjourned by high court to 27th | Sakshi
Sakshi News home page

ఈ నెల 27కు ఓటుకు కోట్లు కేసు వాయిదా

Oct 19 2016 4:44 PM | Updated on Aug 31 2018 8:31 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఓటుకు కోట్లు కేసును బుధవారం హైకోర్టు విచారించింది.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఓటుకు కోట్లు కేసును బుధవారం హైకోర్టు విచారించింది. తెలంగాణ ఏసీబీ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది.

తెలంగాణలో శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందేందుకు ఎమ్మెల్యేల కొనుగోలుకు టీడీపీ కుట్ర చేయడం తెలిసిందే. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ఓటు కోసం ప్రలోభపెట్టడంతో పాటు రూ.50 లక్షలు ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, ఇతరులు.. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement