మాట నిలబెట్టుకుంటాం: కేటీఆర్‌ | By the end of 2017, providing drinking water facility to every house through a pipeline | Sakshi
Sakshi News home page

మాట నిలబెట్టుకుంటాం: కేటీఆర్‌

Dec 20 2016 2:03 PM | Updated on Sep 4 2017 11:12 PM

ముందుగా ఇచ్చిన మాట ప్రకారం 2017 చివరి నాటికి ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ పథకం ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తామని రాష్ట్ర పంచాయితీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌: ముందుగా ఇచ్చిన మాట ప్రకారం 2017 చివరి నాటికి ప్రతి ఇంటికి మిషన్‌ భగీరథ పథకం ద్వారా రక్షిత మంచినీటిని అందిస్తామని రాష్ట్ర పంచాయితీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో మిషన్‌ భగీరథపై చర్చ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంటింటికి మంచి నీటితోపాటు ఇంటర్నెట్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం మిషన్ భగీరథ పైప్లైన్‌లతోపాటు ఫైబర్ గ్రిడ్ కేబుల్ను ఏర్పాటుచేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్) ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందని కేటీఆర్ చెప్పారు. అయితే మిషన్ భగీరథ డీపీఆర్పై అనుమానాలున్నాయని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. కొన్నిచోట్ల అవసరం లేకపోయినా పైప్లైన్లు వేస్తున్నారని, కేవలం డబ్బుల కోసమే ఇలా చేస్తున్నారని భట్టి విక్రమార్క విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement