సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) రూ.198 కోట్లతో 61 అకడమిక్ బ్లాక్లు, 34 కేజీబీవీలకు నూతన భవన నిర్మాణాలకు ఈ నెల 15లోపు శంకుస్థాపనలు చేసి, అక్టోబర్ నాటికి భవనాలు పూర్తి చేయాలని ఉపముఖ్య మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర కేజీబీవీలు దేశంలో అత్యు త్తమంగా ఉన్నాయని, వీటిని మరింత పటిష్ట పరచాలని సూచించారు. కేజీబీవీ, మోడల్ స్కూల్స్, గురుకులాల్లోని విద్యార్థులకు వసతు లు, హెల్త్ కిట్ల పంపిణీ, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, అధికారులతో సచివాలయంలో ఆయన సమీక్షించారు. ఆయా విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ఈ నెల 9లోగా హెల్త్ కిట్లు అందజేయాలన్నారు. 4 దశలుగా ఏడాదికి సరిపడేలా ఇవ్వాలన్నారు. బాలికలకు, బాలురకు విడివిడిగా హెల్త్కిట్లు రూపొందించినట్లు చెప్పారు. ఈ కిట్ల కోసం ఏటా రూ.12 కోట్ల వ్యయం అవుతోందన్నారు.
కలెక్టర్ల నేతృత్వంలో సమీక్షలు
ఈ ఏడాది జనవరి 1 నుంచి అన్ని విద్యా సంస్థల్లో ఒకేరకమైన మెనూ అందిస్తున్నట్లు తెలిపారు. మెనూలో ఉదయం 6 గంటలకే 250 మిల్లీలీటర్ల పాలు.. ఆ తర్వాత అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అందిస్తున్నట్లు వివరించారు. నెలకు 4 సార్లు చికెన్, 2 సార్లు మటన్, రోజూ గుడ్డు, నెయ్యి అందిస్తున్నట్లు చెప్పా రు. పదో తరగతి వార్షిక పరీక్షలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల వారీగా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లాలోని ప్రధానోపాధ్యా యులు,స్పెషల్ ఆఫీసర్లతో సమీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధ మవడంలో లోటుపాట్లు లేకుండా చూడాల ని ఆదేశించారు. సమావేశంలో విద్యాశాఖ డైరెక్టర్ కిషన్, విద్యాశాఖ సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఎండీ విజయ్ కుమార్, చీఫ్ ఇంజనీర్ మల్లేశం, కేజీబీవీల డైరెక్టర్ శ్రీహరి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ శేషు కుమారి పాల్గొన్నారు.
రూ.198 కోట్లతో కేజీబీవీలకు భవనాలు
Published Wed, Jan 3 2018 4:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement