ప్రజల సౌకర్యం కోసం ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించారు.
ఔటర్ ఎంజాయ్మెంట్కు కాదు: డీజీపీ
May 17 2017 11:48 AM | Updated on Apr 3 2019 7:53 PM
హైదరాబాద్: ప్రజల సౌకర్యం కోసం ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించారు. అంతేకాని మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ఎంజాయ్ చేయడానికి కాదని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. ఈ మధ్య కాలంలో ఔటర్రింగ్ రోడ్డుపై ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో బుధవారం ఉన్నతాధికారులు ఔటర్పై స్పీడ్గన్లు ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు బ్రీత్ ఎన్లైజర్లు, వేగ నియంత్రణ కోసం స్పీడ్ గన్లు ప్రారంభిచారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బొంగ్లూర్ అవుటర్ రింగ్ రోడ్డుపై ఈరోజు జరిగిన కార్యక్రమంలో డీజీపీ అనురాగ్ శర్మతో పాటు సీపీ మహేశ్ భగవత్, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement