నగరంలోని అత్తాపూర్ చౌరస్తా సమీపంలోని ఎస్ఆర్ స్టీల్షాపులో చోరీ జరిగింది.
బ్లాంక్ చెక్లు చోరీ
Apr 27 2017 12:28 PM | Updated on Apr 3 2019 3:52 PM
హైదరాబాద్: నగరంలోని అత్తాపూర్ చౌరస్తా సమీపంలోని ఎస్ఆర్ స్టీల్షాపులో చోరీ జరిగింది. బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు షాపు తాళాలు పగలగొట్టి.. కౌంటర్లో ఉన్న లక్ష రూపాయల నగదుతో పాటు 50 బ్లాంక్ చెక్లను ఎత్తుకెళ్లారు. ఇది గుర్తించిన దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
Advertisement
Advertisement