కుటుంబకలహాలతో వ్యక్తి ఆత్మహత్య | A person commits suicide with family disputes | Sakshi
Sakshi News home page

కుటుంబకలహాలతో వ్యక్తి ఆత్మహత్య

Sep 14 2016 5:17 PM | Updated on Nov 6 2018 8:04 PM

భార్యతో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఒక వ్యక్తి విషం తాగి తనువు చాలించాడు.

భార్యతో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఒక వ్యక్తి విషం తాగి తనువు చాలించాడు. ఈ ఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక లక్ష్మారెడ్డిపాలెం మైత్రీకుటీర్ నివాసి చెర్కుపల్లి నరేందర్ బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కాగా, అతనికి కొంతకాలంగా భార్యతో గొడవలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన నరేందర్ బుధవారం ఉదయం ఇంట్లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement