ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి | 1 died in rtc bus accident in hyderabad | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి

Jul 2 2016 3:06 PM | Updated on Sep 4 2018 5:21 PM

వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

హైదరాబాద్: వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి చెక్‌పోస్ట్ వద్ద శనివారం మధ్యాహ్నం జరిగింది. షాపూర్‌కు చెందిన శ్రీనివాస్(35) ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు బైక్ పై వెళ్తుండగా.. చెక్‌పోస్టు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, బందువులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement