ఎనర్జీ కన్సర్వేషన్ వాక్‌ను ప్రారంభించిన మంత్రి | conservation walk in hyderabad | Sakshi
Sakshi News home page

ఎనర్జీ కన్సర్వేషన్ వాక్‌ను ప్రారంభించిన మంత్రి

Dec 17 2017 10:16 AM | Updated on Aug 30 2019 8:37 PM

సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నగరంలోని పీపుల్స్ ప్లాజాలో  ఎనర్జీ కన్సర్వేషన్ వాక్‌ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ఆదివారం ఉదయం  ప్రారంభించారు. ఇన్‌స్టిట్టూట్ ఆఫ్ ఇంజినీర్స్, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జనవరి నుంచి వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందివ్వనున్నట్లు తెలిపారు. అలాగే సాధ్యమైనంత వరకు విద్యుత్‌ను ఆదా చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డిలతోపాటు పలువురు పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఖైరతాబాద్ వరకు ఎనర్జీ కన్సర్వేషన్ వాక్‌ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement