శ్రీశైలం దేవస్థానంలో విజిలెన్స్ తనిఖీలు | vigilance attacks in srisailam temple | Sakshi
Sakshi News home page

శ్రీశైలం దేవస్థానంలో విజిలెన్స్ తనిఖీలు

Apr 18 2016 2:34 PM | Updated on Sep 3 2017 10:11 PM

శ్రీశైల దేవస్థానం ఇంజనీరింగ్ సెక్షన్‌లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు.

శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం ఇంజనీరింగ్ సెక్షన్‌లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. కర్నూలు నుంచి వచ్చిన విజిలెన్స్ అధికారుల బృందం దేవస్థానం పాలకమండలి కార్యాలయంలోని ఇంజనీరింగ్ విభాగంలో రికార్డులు, రసీదు పుస్తకాల తనిఖీ చేశారు. నకిలీ రసీదు పుస్తకాలు ముద్రించి అక్రమంగా మట్టి తరలింపు చేపట్టినట్టు శ్రీనివాస్ అనే వర్క్ ఇన్‌స్పెక్టర్‌పై పది రోజుల క్రితం దేవస్థానం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజిలెన్స్ తనిఖీలకు ప్రాధాన్యం ఏర్పడింది.
 

శ్రీశైలం దేవస్థానంలో విజిలెన్స్ తనిఖీలు
vigilance attacks in srisailam temple
 srisailam temple, vigilance attacks , శ్రీశైలం దేవస్థానం, విజిలెన్స్ , తనిఖీలు
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం ఇంజనీరింగ్ సెక్షన్‌లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. కర్నూలు నుంచి వచ్చిన విజిలెన్స్ అధికారుల బృందం దేవస్థానం పాలకమండలి కార్యాలయంలోని ఇంజనీరింగ్ విభాగంలో రికార్డులు, రసీదు పుస్తకాల తనిఖీ చేశారు. నకిలీ రసీదు పుస్తకాలు ముద్రించి అక్రమంగా మట్టి తరలింపు చేపట్టినట్టు శ్రీనివాస్ అనే వర్క్ ఇన్‌స్పెక్టర్‌పై పది రోజుల క్రితం దేవస్థానం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజిలెన్స్ తనిఖీలకు ప్రాధాన్యం ఏర్పడింది.
 

Advertisement
 
Advertisement
Advertisement