నగరంలోని వనస్థలిపురంలోని సుష్మాథియేటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కీరాల కృష్ణ(28) అనే సాక్షి విలేకరికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలోని సుష్మాథియేటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కీరాల కృష్ణ(28) అనే సాక్షి విలేకరికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం రాత్రి బైక్పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన కృష్ణను ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కృష్ణ తలకు తీవ్రగాయమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.