టీఆర్‌ఎస్ అధికారం శాశ్వతం కాదు: మందకృష్ణ | manda krishana madiga criticized the TRS government | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ అధికారం శాశ్వతం కాదు: మందకృష్ణ

Feb 15 2016 8:08 PM | Updated on Oct 8 2018 3:00 PM

టీఆర్‌ఎస్ అధికారం, సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు.

టీఆర్‌ఎస్ అధికారం, సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. సోమవారం ఆయన హన్మకొండలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలు భ్రమల్లో ఉన్నారని, నిజం తెలుసుకుని కారుకు బ్రేకులు వేసే రోజులు త్వరలోనే వస్తాయని అన్నారు.

రెండు రోజులు ఢిల్లీలో ఉన్న సీఎం.. ఎస్సీ వర్గీకరణ పై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. సీఎంగా కేసీఆర్ పదిసార్లు ఢిల్లీ వెళ్లారని, ప్రభుత్వం ఏర్పడి 20 నెలలయిందని, అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి 14 నెలలవుతోందని వివరించారు. కేసీఆర్‌కు మాదిగలపై ద్వేషం ఉందని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా వర్గీకరణ ప్రస్తావన తేవడం లేదన్నారు. టీఆర్‌ఎస్‌లో ఉన్న ఎనిమిది మంది మాదిగ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు భయపడి నోరెత్తడం లేదన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement