కారెక్కిన గుండు సుధారాణి


హైదరాబాద్: టీడీపీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి టీఆర్ఎస్ గూటికి చేరారు. శనివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో ఆమె టీఆర్‌ఎస్‌లో చేరారు. గుండు సుధారాణి సైకిల్‌ను వీడి కారు ఎక్కనున్నారని గత కొన్నిరోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.



వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల నేపథ్యంలో గుండు సుధారాణి పార్టీ మారడం టీడీపీకి ఎదురుదెబ్బ కానుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతునిచ్చే ఉద్దేశంతో ఆమె టీఆర్‌ఎస్‌లో చేరినట్టు తెలిపారు.




 

Read also in:
Back to Top