శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 430 గ్రాముల బంగారం బయటపడింది. ఈ రోజు ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని అదనపు వివరాల కోసం విచారణ చేపట్టారు. ప్రయాకుడి వివరాలు తెలియాల్సి ఉంది.