రూ. కోటి విదేశీ కరెన్సీ స్వాధీనం


హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం అధికారులు శుక్రవారం ఉదయం ఓ ప్రయాణికుడి నుంచి రూ. కోటి విలువైన విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. అరేబియా ఎయిర్‌లైన్స్ విమానంలో దుబాయి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సదరు ప్రయాణికుడి వద్ద పెద్ద మొత్తంలో యూరోలు, దిర్హమ్‌లు దొరికాయి. అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికులు 5 వేల అమెరికన్ డాలర్ల నగదు, మరో 5 వేల డాలర్లు చెక్కు రూపంలో మాత్రమే తమ వద్ద ఉంచుకునేందుకు అనుమతి ఉంటుంది. అంతకు మించి ఉంటే నిబంధనల మేరకు శిక్షార్హులవుతారు.



 

Read also in:
Back to Top