శవాలకు పూసిన పూలు!

శవాలకు పూసిన పూలు! - Sakshi


 ఫొటో స్టోరీ

 

ప్రముఖ ఫొటోగ్రాఫర్ జాన్  ఐజక్... 1993లో ఓసారి కంబోడియా వెళ్లారు. అక్కడ ఆయనను ఓ దృశ్యం ఆకర్షించింది. ఓ పేద అమ్మాయి... ఒక కొలనులో దిగి, కలువ పూలను ఏరుకుంటోంది. పువ్వును కోసిన ప్రతిసారీ ఆ చిన్నారి ముఖం సంతోషంతో విచ్చుకుంటోంది. అది చూసి ముచ్చటపడిన ఐజక్... ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఈ ఫొటో వెనుక... పెద్ద కథే ఉంది!

 

కలువపూలతో కళకళలాడుతోన్న ఈ కొలను... కేవలం కొలను కాదు. ఓ పెద్ద శ్మశానవాటిక! అవును. హింస, భయానక వ్యాధులు, ఆకలి మంటల కారణంగా కంబోడియాలో ఎప్పుడూ మృత్యుదేవత స్వైరవిహారం చేస్తూనే ఉంటుంది. ఎందరినో కర్కశంగా కబళిస్తూ ఉంటుంది. వాళ్లందరికీ అంత్యక్రియలు చేయడం పెద్ద పని. కాబట్టి  ఆ మృతదేహాలను తీసుకెళ్లి కొలనుల్లో పారేస్తుంటారు.



అలాంటి కొలనుల్లో ఇదీ ఒకటి. పైకి పూల అందాలతో అలరిస్తోన్నా... అడుగున శవాల గుట్టలను తనలో దాచుకుందీ కొలను. అది తెలియని ఈ చిట్టితల్లి... చక్కగా కొలనులోకి దిగి, ఆనందంగా కలువపూలను రోజూ కోసుకుంటుంది. వాటిని తీసుకెళ్లి అమ్ముకుంటుంది. పాపం తనకి మాత్రం ఏం తెలుసు... ఆ పూలు కొన్ని వందల విగత జీవుల మీద వికసించాయని, కొన్ని అభాగ్య జీవితాల ఆనవాళ్లను తమలో దాచుకున్నాయని!

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top