అచ్చంగా మిగిలింది.. 23 శాతమే! | Scientists have demonstrated that only 23 percent of the land was left on land | Sakshi
Sakshi News home page

అచ్చంగా మిగిలింది.. 23 శాతమే!

Nov 3 2018 12:56 AM | Updated on Apr 4 2019 3:25 PM

Scientists have demonstrated that only 23 percent of the land was left on land - Sakshi

భూమి మీద స్వచ్ఛంగా మిగిలిపోయిన ప్రాంతం 23 శాతం మాత్రమేనని తేల్చేశారు శాస్త్రవేత్తలు. మిగిలినదంతా మనిషి ప్రభావంతో నాశనమైందేనని వైల్డ్‌ లైఫ్‌ కన్సర్వేషన్‌ సొసైటీ, క్వీన్స్‌ల్యాండ్‌ యూనివర్శిటీల అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఈ 23 శాతం స్వచ్ఛమైన భూభాగాన్నైనా కాపాడుకోగలిగితే వాతావరణ మార్పుల ప్రభావాన్ని మరింత సమర్థంగా ఎదుర్కొనే అవకాశముంటుందని వీరు హెచ్చరిస్తున్నారు.అమెరికా, కెనెడా, ఆస్ట్రేలియా, రష్యా, బ్రెజిల్‌లలో ఈ ప్రాంతాలు కేంద్రీకృతమై ఉన్నాయని జాన్‌ రాబిన్‌సన్‌ అనే శాస్త్రవేత్త చెప్పారు.

జన సాంద్రత, రవాణా సౌకర్యాలు తదితర ఎనిమిది అంశాలఆధారంగా మానవ ప్రభావం అతి తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించామని, 2009లో సేకరించిన ఈ వివరాల ఆధారంగా భూమి మీద స్వచ్ఛంగా మిగిలిపోయిన భూమి, సముద్ర ప్రాంతాల విస్తీర్ణం భూవిస్తీర్ణంలో 23 శాతమే అన్న అంచనాకు వచ్చామని ఆయన వివరించారు. భూతాపోన్నతికి కారణమైన కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చేసుకోవడంలో ఈ ప్రాంతాలు అత్యంత కీలకమైనవని అన్నారు. అయితేమానవ చర్యల కారణంగా భూమి మీద 77 శాతం, సముద్రాల్లో దాదాపు 87 శాతం ప్రాంతంలో పర్యావరణ అసమతౌల్యతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement