
నేడే ఓట్ల జాతర
సార్వత్రిక సంగ్రామం జరగనుంది. జిల్లాలోని రెండు లోక్సభ, పది అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి.
సాక్షి, సంగారెడ్డి: సార్వత్రిక సంగ్రామం జరగనుంది. జిల్లాలోని రెండు లోక్సభ, పది అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధమైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ ప్రకటించారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేలా ఓటర్లను నజరానాలతో ప్రోత్సహించడం ద్వారా జిల్లాలో 95 శాతం పోలింగ్ జరిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎన్నికలకు సంబంధించిన సమగ్ర గణాంకాలు ఇలా ఉన్నాయి...