ఒక్కసారి ఓటు వేస్తే మూడు సార్లు వేసినట్లే... | Technical problems in Electronic Voting Machines in mahabubnagar district | Sakshi
Sakshi News home page

ఒక్కసారి ఓటు వేస్తే మూడు సార్లు వేసినట్లే...

Apr 30 2014 11:02 AM | Updated on Oct 8 2018 5:04 PM

ఓటు వేయకుండానే ఓటు వేసినట్లు ఈవీఎంలో కనిపించడంతో ఓటర్లు ఆయోమయానికి గురయ్యారు.

 ఒక్కసారి ఈవీఎంలో ఓటు వేస్తే మూడు సార్లు ఓటు వేసినట్లు కనిపించడంతో ఓటర్లు అయోమయానికి గురయ్యారు. అదే విషయాన్ని పోలింగ్ బూత్ సిబ్బందికి వెల్లడించారు. దాంతో వారు ఈవీఎంలను పరిశీలించారు. ఈవీఎంలో సాంకేతిక లోపం ఏర్పడటం వల్ల అలా జరిగిందని వారు వెల్లడించారు.

 

దాంతో పోలింగ్ నిలిపివేసి....సమాచారాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కొత్త ఈవీఎంలు తక్షణమే ఏర్పాటు చేయాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ ఘటన మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ తాలుకా ఐజ మండలం బూమ్పురంలో బుధవారం చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement