వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ దాడి | tdp attack ysrcp leaders | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ దాడి

Mar 31 2014 2:25 AM | Updated on Aug 10 2018 9:40 PM

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకులు దాడి చేయడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

 కదిరి, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకులు దాడి చేయడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని 26వ వార్డుకు చెందిన పోలింగ్ కేంద్రంలో ఓ మహిళ చాలాసార్లు ఓటు వేయడానికి రావడంతో వైఎస్సార్‌సీపీ ఏజెంట్ జిలాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటికే ఆమె నాలుగుసార్లు ఓటు వేసిందని ఆయన చెబుతుండగా అక్కడే ఉన్న టీడీపీ నాయకుడు ఇటికెల బాబా, మరికొందరు అతనిపై దాడి చేయడంతో అతని ఎడమ చేయి విరిగింది.

 

దాడిని అడ్డుకునేందుకు యత్నించి సాజిద్‌తోపాటు మరో ఇద్దరు గాయపడ్డారు. విషయం తెలుసుకుని ఇరువర్గాలు అక్కడ మోహరించడంతో పోలీసులు వారిని దూరంగా పంపేశారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిని  నియోజకవర్గ సమన్వయకర్త అత్తార్ చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య,  జొన్నా పరమేష్‌తో తదితరులు పరామర్శించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement