- రేపే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
- పది గంటల కల్లా ఫలితం
- నర్సీపట్నం, యలమంచిలిలో సందడి
నర్సీపట్నం, న్యూస్లైన్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల ముహూర్తం సమీపిస్తోంది. ఓట్ల లెక్కింపు మరో 24 గంటల్లో ప్రారంభం కానుంది. సుమారు 45 రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. పది గంటల కల్లా తొలి ఫలితం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు పట్టణాల్లో చైర్మన్ పీఠాలను ఏ పార్టీవారు అధిష్టించనున్నారో తేలిపోనుంది. జిల్లాలో నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలకు మార్చి 30న పోలింగ్ నిర్వహించారు.
సోమవారం ఈ ఓట్ల లెక్కింపునకు అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. దీంతో రెండు పురపాలికల్లోనూ సందడి నెలకొంది. నర్సీపట్నంలో 27, యలమంచిలిలో 24 వార్డులున్నాయి. యలమంచిలిలో ఒకటి ఏకగ్రీవమైంది. రెండు పట్టణాల్లోనూ 50 వార్డుల్లో 75,265 మంది ఓటర్లకు 59,441 మంది ఓటేశారు. ప్రధానంగా వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్యే పోటీ చోటుచేసుకుంది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వీటి ఫలితాలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభిస్తారు. నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి పెదబొడ్డేపల్లి డాన్బాస్కోప్ కాలేజి, యలమంచిలికి అనకాపల్లి ఏఎమ్ఏఎల్ కాలేజీలోనూ లెక్కిపు చేపడతారు. దీనిపై ఇప్పటికే సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చారు. లెక్కింపునకు ఒక్కో మున్సిపాలిటీకి 30 మంది అధికారులతో పాటు మరో 30 మంది కిందస్థాయి సిబ్బందిని నియమించారు.
ఈవీఎంలతో పోలింగ్ కారణంగా ఫలితాలు వేగంగా వెలువడనున్నాయి. పది గంటల కల్లా తొలి ఫలితం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుంటే మధ్యాహ్నం ఒంటి గంట కల్లా లెక్కింపు ముగించి, పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈమేరకు ప్రజాప్రతినిధులు, స్థానికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో పోటీచేసిన వివిధ పార్టీల ప్రతినిధులు తమ అభ్యర్థుల విజయావకాశాలపై ధీమా వ్యక్తం చేస్తూ, సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు
మరో 24 గంటలే..!
Published Sun, May 11 2014 2:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement