మౌజన్‌ హత్యకేసులో నిందితుడి అరెస్టు | The accused was arrested in a murder case | Sakshi
Sakshi News home page

మౌజన్‌ హత్యకేసులో నిందితుడి అరెస్టు

Jan 4 2018 1:47 AM | Updated on Jan 4 2018 4:14 AM

The accused was arrested in a murder case - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న అర్బన్‌ జిల్లా ఎస్పీ రాజకుమారి, చిత్రంలో నిందితుడు (ముసుగులో)

రాజమహేంద్రవరం రూరల్‌: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మసీదు మౌజన్‌ మహ్మద్‌ ఫరూఖ్‌ హత్య కేసులో అనంతపురం జిల్లా గుంతకల్లు శ్రీలంక కాలనీకి చెందిన ఆరుముగం మణిరత్నం, అలియాస్‌ మణి, అలియాస్‌ రాజుని బుధవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు.

అతని వద్ద నుంచి మసీదులో, ప్రకాశంనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గుడిలో చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీ బి.రాజకుమారి విలేకరులకు వెల్లడించారు. గత ఏడాది డిసెంబరు 29 అర్ధరాత్రి లాలాచెరువులోని నూరానీ మసీదులో మౌజన్‌గా పని చేస్తున్న మహ్మద్‌ ఫరూఖ్‌ (67) నిద్రపోతుండగా కర్రతో తలపైన కొట్టి చంపిన విషయం విదితమే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement