- జూలై 8 నుంచి గడప గడపకూ వెళ్లండి, మాట్లాడండి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్ధేశం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి, ఎమ్మెల్యేలు కావాలనుకునే వారికి, ఉత్సాహంగా పనిచేసే వారికి మద్దతు ఇస్తానని వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. రాజకీయాల్లో గెలవాలనుకునే వారు, ఎమ్మెల్యేలు కావాలనుకునే వారు రాజకీయ కుటుంబం నుంచే రావాల్సిన అవసరం లేదు. వారి తండ్రి, మామ ఎమ్మెల్యే అయి ఉండాల్సిన పని లేదు. గత కుటుంబ చరిత్రకు ఉండాల్సిన పనిలేదు. నాయకుడు కావాలనుకున్న వారికి ఒక సీక్రెట్ చెపుతానంటూ... గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లడమనేదే ఆ సీక్రెట్ అన్నారు. ‘‘ప్రజలతో మాట్లాడాలి. వారి తో కొంత సమయం వెచ్చించాలి. సాధకబాధకాలు తెలుసుకోవాలి. వీధి, వాడ, డొంక అన్ని సమస్యలపైనా అవగాహనకు రావాలి.
గ్రామాన్ని వదిలే సమయానికి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. ఇందుకు జూలై 8 నుంచి ప్రారంభమయ్యే గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమం పూర్తిగా ఉపయోగపడుతుంది. నాయకునిగా ఎదగడానికి ఇదొక మహత్తర అవకాశం అవుతుంది’’ అని జగన్ విశ్లేషించారు. విజయవాడలో మంగళవారం జరిగిన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి ఉత్సాహంగా వచ్చేవారిని తాను స్వాగతిస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో అధికార టీడీపీ సాగిస్తున్న అవినీతి, అక్రమ పాలన గురించి గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో ప్రజలకు విపులంగా వివరిస్తే ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తారని విశ్లేషించారు.
తెలుగు ప్రజల నమ్మకానికి ప్రతిరూపమైన ‘యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ’ విధివిధానాలను వివరిస్తూ.. టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ, ‘చంద్రబాబు అవినీతి చక్రవర్తి, 1,45,549 కోట్లు’ పుస్తకంలో ప్రచురించిన కుంభకోణాల వివరాలను తెలియజెపితే చాలని పార్టీ శ్రేణులు, నాయకులకు జగన్ ఉద్బోధించారు. వాగ్ధానాల వంచనలతో, అధికారానికి చంద్రబాబు వేసిన అడ్డదారి నిచ్చెనలను తెలియజెప్పి... చంద్రబాబు పాసా? ఫెయిలా? ప్రజా బ్యాలెట్ అనే కరపత్రంలోని వంద ప్రశ్నలకు మార్కులు వేయాలని ప్రజలను కోరితే ఆయనకు సున్నా మార్కులే వస్తాయని గంటాపథంగా చెప్పారు.
ప్రతి ఇంటికీ వెళ్లండి...: దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి జన్మదినమైన జూలై 8 నుంచి ఐదు నెలల పాటు ప్రతి ఇంటికి ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యే, కో ఆర్డినేటర్ వెళ్లాలని జగన్ సూచించారు. ‘ప్రతి ఇంటి వద్ద కనీస సమయమైనా ఉండాలి. ఆ ఇంట్లో వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి. వారి ఆశీస్సులు, ఆశీర్వాదాలు పొందాలి. ఒక్కో గ్రామానికి 4, 5 గంటలు వెచ్చించాలి. ఇలా అయిదు నెలల్లో అన్ని గ్రామాలను చుట్టాలి. అదే సమయంలో గ్రామంలోని ప్రతి సమస్యను గుర్తించాలి. పార్టీ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనే వారిని గుర్తించాలి. బూత్ కమిటీని వేయాలి. ఇలా చేస్తే మీరే లీడర్లు అవుతార’ని భరోసాగా చెప్పారు. ఈ కార్యక్రమాన్ని రచ్చబండలా చేయవద్దని కోరారు. సీనియర్ శాసనసభ్యుడు, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రెండేళ్లలో రెండు పర్యాయాలు నియోజకవర్గమంతా తిరిగారు. అలా చేసినవారిని ప్రజలు ఎందుకు ఆశీర్వదించరు? వారు ప్రజాప్రతినిధిగా ఎందుకు గెలవరని ప్రశ్నించారు. ప్రజల ఆప్యాయతలు, ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయన్నారు.
గడప గడపకూ వెళ్లండి: వైఎస్ జగన్
Published Wed, Jun 15 2016 1:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement