మెగా ఆక్వాఫుడ్ గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటన | YSRCP leader YS Jaganmohan reddy to visit mega aqua food projects | Sakshi
Sakshi News home page

మెగా ఆక్వాఫుడ్ గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటన

Oct 15 2016 12:05 PM | Updated on May 29 2018 3:48 PM

మెగా ఆక్వాఫుడ్ గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటన - Sakshi

మెగా ఆక్వాఫుడ్ గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటన

వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 19న జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని శనివారం తెలిపారు.

పశ్చిమగోదావరి: వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 19న జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని శనివారం తెలిపారు. భీమవరం మండలంలోని తుందుర్రు, బేతపూడి, జొన్నలగరువుల్లో పర్యటించి మెగా ఆక్వాఫుడ్ ప్రాజెక్టు బాధితులను పరామర్శిస్తారని పేర్కొన్నారు. జిల్లాలోని గ్రామాల్లో మెగా ఆక్వాఫుడ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

పలుమార్లు ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో గత నెల రోజులుగా ఆక్వాఫుడ్ ప్రాజెక్టు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. కాగా, బాధిత గ్రామాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం ఇప్పటికే పర్యటించింది. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన బృందం అక్కడి పరిస్ధితులను అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement