ఆరోగ్యం కోసం వ్యాయామం | world health day rally | Sakshi
Sakshi News home page

ఆరోగ్యం కోసం వ్యాయామం

Apr 7 2017 10:43 PM | Updated on Sep 5 2017 8:11 AM

ఆరోగ్యం కోసం వ్యాయామం

ఆరోగ్యం కోసం వ్యాయామం

కాకినాడ వైద్యం : సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ వ్యాయామంతో పాటూ పౌష్టికాహారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మానసిక కుంగుబాటుపై మాట్లాడు

కాకినాడ వైద్యం : సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ వ్యాయామంతో పాటూ పౌష్టికాహారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మానసిక కుంగుబాటుపై మాట్లాడుకుందామంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుçపందుకుని కుటుంబ సభ్యులందరూ కూర్చొని చర్చించుకోవాలన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో పని ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఎదురవుతోన్న ఒత్తిడులతో పలు రకాల మానసిక రుగ్మతలకు గురవుతున్నారన్నారు. మానసిక,శారీరక రుగ్మతల బారి నుంచి బయటపడేందుకు ఒకరికొకరు పరస్పరం మాట్లాడుకోవడం ద్వారా అనారోగ్యాల సమస్యను అధిగమించవచ్చన్నారు. ఒక క్రమ పద్ధతిలో ఆహారం తీసుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యానికి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని కోరారు. మంచి ఆరోగ్యం కోసం తగినంత విశ్రాంతి, నిద్ర తప్పనిసరన్నారు. ఆత్మన్యూనతా భావంతో బాధపడేవారికి కౌన్సిలింగ్‌ ఎంతగానో దోహదపడుతుందని జాయింట్‌ కలెక్టర్‌–2 రాధాకృష్ణమూర్తి తెలిపారు. జన్యుపర, రసాయన కారణాలతో ఆత్మన్యూనత భావం రావచ్చని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ చంద్రయ్య తెలిపారు. యోగా,«« ధ్యానంతో పని ఒత్తిడి, ఆందోళనల నుంచి బయటపడొచ్చన్నారు. 
ప్రజలకు మెరుగైన సేవలు 
నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డిసుబ్రహ్మణ్యం తెలిపారు. ముత్తానగర్‌లో సీహెచ్‌సీలో శుక్రవారం ప్రపంచ ఆరోగ్యదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్యకేంద్రాన్ని సీఎం చంద్రబాబు విజయవాడలో ప్రారంభించారు. ఇక్కడ రెడ్డి సుబ్రహ్మణ్యంతోపాటూ జిల్లా కలెక్టర్‌ అరుణ్‌కుమార్, సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఈ–యుపీహెచ్‌సీలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలో ఉన్న ఈ–యుపీహెచ్‌సీల్లో  ప్రతిభ కనబరచిన కిర్లంపూడి, నగరం పీహెచ్‌సీలకు, నగరం, బలబద్రపురం సబ్‌సెంటర్లలో పనిచేస్తున్న సిబ్బందికి ఏపీ శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావులు బహుమతులు పంపిణీ చేశారు. 
చంద్రన్న బీమాపై సమీక్ష
కాకినాడ సిటీ : అలసత్వం లేకుండా బీమా  క్లైమ్‌లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో చంద్రన్న బీమా అమలుపై జిల్లా మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రాంతాల వారీగా సమీక్షిస్తూ గిరిజన ప్రాంతంలో 72 క్లైమ్‌లు పెండింగ్‌లో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రన్న బీమా అమలు తేదీ 2016 అక్టోబర్‌ నుంచి ఇప్పటివరకు 4,417 మరణాలు కాల్‌ సెంటర్‌లో నమోదయ్యాయని డీఆర్‌డీఏ పీడీ మల్లిబాబు వివరించారు. వీటిలో 48 పాలసీలు అర్హత లేనివిగా పరిగణించి మిగిలిన 4,369 రిజిస్టర్‌ చేశామన్నారు. 3,951 క్లైమ్‌లు ఇన్సూరెన్స్‌ కంపెనీకి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశామని తెలిపారు. మిగిలిన 415 క్లైమ్‌ల్లో 93 యాక్సిడెంటల్, 322 నార్మల్‌ క్లైమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. బీమా విషయంలో జిల్లా 8వ స్థానంలో ఉందని ప్రథమ స్ధానంలోకి తీసుకురావాలని ఆదేశించారు. 
డిజిధన్‌ మేళాలపై సమీక్ష
కాకినాడ సిటీ :  జిల్లా వ్యాప్తంగా అంబేడ్కర్‌ జయంతిని పురసరించుకుని డిజిధన్‌మేళాల నిర్వహణ కార్యాచరణపై శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులు, బ్యాంకర్లతో జాయింట్‌ కలెక్టర్‌ సత్యనారాయణ సమీక్షించారు. 14వ తేదీ మధ్యాహ్నం 2గంటల నుంచి డిజిధన్‌ మేళాలను నిర్వహించాలని, సాయంత్రం 4గంటలకు ప్రధానమంత్రి ప్రసంగం లైవ్‌టెలీకాస్ట్‌ జరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహణకు అనువైన ఆడిటోరియం గుర్తించాలని, సభాస్థలి వద్ద బ్యాంకులు, నగదురహిత లావాదేవీలు నిర్వహిస్తున్న ప్రభుత్వ శాఖలు ప్రజలకు అవగాహన కల్పించే స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎల్‌డీఎం సుబ్రహ్మణ్యం, డీఆర్‌డీఏ పీడీ మల్లిబాబు, ఆర్డీవో రఘుబాబు, డీఎస్‌వో రవికిరణ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement