దొంగతనానికి యత్నించి దొరికి పోయారు | Women attempting to steal | Sakshi
Sakshi News home page

దొంగతనానికి యత్నించి దొరికి పోయారు

Apr 22 2016 10:26 AM | Updated on Mar 28 2018 11:26 AM

వేసవి ఉక్కపోత భరించలేక ఆరు బయట చల్లగాలికి పడుకున్న మహిళలపై ఇద్దరు మహిళలు దోపిడీకి తెగబడ్డారు.

వేసవి ఉక్కపోత భరించలేక ఆరు బయట చల్లగాలికి పడుకున్న మహిళలపై ఇద్దరు మహిళలు దోపిడీకి తెగబడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దతుప్రాలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న నలుగురు మహిళల నుంచి నాలుగు తులాల బంగారు, 40 తులాల వెండి, రూ.20వేల నగదును ఇద్దరు గుర్తు తెలియని మహిళలు చోరీ చేశారు. అంతటితో ఆగక మరో ఇంట్లోకి ప్రవేశించగా వారు మేల్కొని కేకలతో అందరినీ నిద్రలేపారు. అందరూ కలిసి ఒక మహిళను సొత్తుతో సహా పట్టుకున్నారు. శుక్రవారం ఉదయం పోలీసులకు ఆమెను అప్పగించారు. మరో మహిళ పరారైంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement